ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిపిఐ  పవన్ కళ్యాణ్ మీద సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణ పలు సంచలన వ్యాఖ్యల చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా మారిపోయారని విధంగా విమర్శలు చేయడం జరుగుతోంది. పూర్తిగా పవన్ కళ్యాణ్ బిజెపి జెండానే మోస్తూ ఉన్నారని కాషాయ బట్టలు కట్టుకొని నుదుటిని బొట్టు పెట్టుకొని మరి జెండా మోస్తున్నారంటూ సిపిఐ రామకృష్ణ పలు రకాల ఆరోపణలు చేయడం జరిగింది.


అలాగే సనాతన ధర్మం పాటించే వ్యక్తి చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారు.తన భార్య అయిన క్రిస్టియన్ చేత ఎందుకు తిరుమలలో గుండు చేయించారంటూ అది అంత అవసరమా అనే విధంగా సిపిఐ నేత రామకృష్ణ ప్రశ్నించడం జరిగింది. వక్ఫ్ చట్టం పైన అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీరు పైన సిపిఐ నేత విమర్శలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజినోవ తన కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదం నుంచి బయటపడడంతో తిరుమలకు వెళ్లి అక్కడ శ్రీవారిని దర్శించుకొని మరి తలనీలాలు సమర్పించారు. అనంతరం 17 లక్షల రూపాయలు విరాళంగా కూడా అందించడం జరిగింది.


క్రిస్టియన్ అయినటువంటి అన్నా లేజీనోవ టిడిపి అధికారులకు కూడా డిక్లరేషన్ ఫారం అందించి మరి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఇటీవలే అన్నా లేజీనోవ తలనినాలాలు ఇవ్వడం చేత కూడా చాలా రకాల సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. సిపిఐ రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా మరింత వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలకు అటు జనసేన నేతలు కార్యకర్తలు కూడా కౌంటర్లు వేస్తూ ఉన్నప్పటికీ ట్రోల్ చేసేవారు మాత్రం ఆగడం లేదు. గతంలో కూడా సిపిఐ రామకృష్ణ పవన్ కళ్యాణ్ పైన సీఎం చంద్రబాబు పైన కూడా పలు రకాల వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరొకసారి ఇలా చేయడంతో జనసేన కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: