ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.. మ్యారేజ్ బ్యూరో పేరిట కొంతమంది యువతులకు వలవేసి వారితో కోరికలు తీర్చుకొని మరి నగ్న వీడియోలు తీసి యువతులను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నట్లుగా ఇప్పుడు విశాఖపట్నంలో సంచలనంగా మారింది. ఈ విషయం పైన ఒక యువతి ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడు పైన విశాఖలో నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 30 మంది యువతుల వీడియోలు తీసినట్లుగా ఆ యువతి తెలిపింది. అంతేకాకుండా నిందితుడికి సైతం సంబంధించిన చాటింగ్ ని మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేసింది.



మ్యారేజ్ బ్యూరో హెర్బల్ ప్రొటెక్షన్ అంటూ ఒక యాప్ ని క్రియేట్ చేసి ఒక ముఠా పెళ్లి కాని అమ్మాయిల వివరాలను సైతం సేకరించి ఆ తర్వాత పరిచయం ఏర్పరచుకొని ప్రేమ అంటూ వెంటపడి వారిని ముగ్గులోకి దింపి మరి కూల్ డ్రింక్ ఇచ్చి మత్తుమందు కలిపి మరి యువతులపైన అత్యాచారం చేస్తున్నారంటూ ఆ యువతి తెలియజేసింది. అంతేకాకుండా ఆ వీడియోలను తీసి మరి ఆ తర్వాత వారు పిలిచినప్పుడు రాకపోతే ఆ వీడియోలను పోర్న్ సైట్లో పెడతామంటూ యువతులను బెదిరిస్తున్నారట.

అలా కొంతమంది కేటుగాళ్లు ప్రతిరోజు తమ కోరికలను తీర్చుకుంటున్నారు అంటూ యువతి తెలియజేసింది.ఈ క్రమంలోనే వీరి వల్ల బలైన యువతి గర్భం దాల్చడంతో ఆ యువతీకి బలవంతంగా అబార్షన్ చేయిస్తున్నారు అంటూ ఆ బాధితురాలు తెలియజేస్తోంది .ఒకవేళ అబార్షన్ చేయించుకోకపోతే ఆ యువతులను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలియజేస్తూ ఈమె పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ విషయం పైన పోలీసులను ఆశ్రయించగా అలా వెళ్లడం మీదే తప్పు అంటూ నిందితుల వైపు గానే మాట్లాడుతున్నారని దీంతో యువతి మీడియాను సైతం ఆశ్రయించిన ఆ యువతి మీడియా ముందు అన్ని విషయాలను చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: