ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సమయంలో ఎన్నో హామీలను ఇచ్చింది.అయితే ఈ హామీలను నెరవేర్చలేదని ఇప్పటికి అటు ఏపీ ప్రజలతో పాటు చాలామంది నేతలు కూడా అసహనాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలే చేయడం లేదని చాలామంది అసహనాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు.అలా ఒక్కొక్క హామీలను సైతం నెరవేరుస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు తాజాగా ఇప్పుడు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. అదే నిరుద్యోగ భృతి.. ప్రతి నెల 3000 రూపాయల చొప్పున నిరుద్యోగులకు భృతి ఇస్తామంటే సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే ఇప్పుడు వీరిలో వర్గీకరణ చేసి కొంతమందికి అమలు చేసే విధంగా ఏపీ సర్కార్ నిధులను విడుదల చేస్తుందట. ఇందుకోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలంటూ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలియజేశారు.


నిరుద్యోగ భృతి కి సంబంధించి గ్రాడ్యుయేషన్, పీజీ చదివినా కూడా నిరుద్యోగులుగా చాలామంది ఉన్నారు. మరి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తూ చదువుతూ ఉన్నారు. అదేవిధంగా బ్రాహ్మణులు తమ మతపరమైన విద్యను కూడా బోధించి ఖాళీగా ఉన్నారట. దైవ కార్యక్రమలకు సంబంధించి ఆగమ శాస్త్రం చదివిన వారందరికీ కూడా ఈ పథకాన్ని ఇచ్చేలా ఏపీ సీఎం చంద్రబాబు ప్లాన్ చేశారట. ఇందుకు సంబంధించి విధివిధానాలను కూడా రిలీజ్ చేశారు ఏపీ ప్రభుత్వం.


దీంతో రాష్ట్రంలో ఆగమ శాస్త్రం చదివి ధ్రువీకరణ పత్రం పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వీరికి 3000 రూపాయలు అందిస్తుంది ప్రభుత్వం అంటూ తెలుపుతున్నారు. అయితే ఇందులో లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా  యువ పండితులు 599 మంది మాత్రమే ఉన్నారట. ఎవరైనా ఈ లిస్టులో కనుక తమ పేరు లేకపోతే కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా అవకాశం కల్పిస్తోంది. ఇక జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించి డబ్బులను కూడా విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: