మొత్తానికి కళ్యాణ్ సార్ డిసైడ్ అయిపోయారు. మనకెందుకు ఈ పొత్తు గిత్తూ... మనకి గెలిసే అంత బలం... బలగం లేదా ఏంటి అనే ఫీలింగ్ లోలోపల ఉన్నా, ఆ ఫీలింగ్ మొత్తాన్ని కప్పిపెట్టి మరీ కాషాయ పార్టీతో కలిసి వెళుతూ, ఇష్టం లేకుండానే ఆ పార్టీ ఆజ్ఞను పాటిస్తూ వస్తున్న కళ్యాణ్ సార్ ను అసలు ఏమాత్రం పట్టించుకోకుండా , సొంతంగానే కాషాయ పార్టీ ఏపీలో కదన రంగం లోకి దూకేస్తోంది. అసలు ఏమాత్రం కళ్యాణ్ సార్ ఆ పార్టీ నేతలను పట్టించుకోనట్టు వ్యవహరిస్తుండడం సైనికులకు అరికాలు  నుంచి మంట పుట్టిస్తోంది. అసలు మన పార్టీని, మన నాయకుడిని ఎంతగా అవమానిస్తున్నా, ఇంతగా వాళ్ళని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు అని ప్రశ్నించేస్తున్నారు. అంతేనా ఎలాగు పాత పార్ట్నర్ బాబు గారు పొత్తు పెట్టుకుంటామని అంటూ వెంట పడుతున్నారు కాబట్టి, ఆయన తో పొత్తు పెట్టుకుని వెళితే బెటర్ అనే అభిప్రాయం కళ్యాణ్ సార్ కి వచ్చినా, దీనిపై విమర్శలు వచ్చి పడతాయి అని, అసలు అంత అవసరమా అన్నట్లు గా వ్యవహరిస్తున్నారు. 



తిరుపతిలో పోటీ మేము చేస్తున్నాము  అని కాషాయ పార్టీ  చెప్పడమే కాదు, వారు వ్యవహరిస్తున్న తీరు సైనికులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దీనిపై బహిరంగ ప్రకటన చేయకుండా, కళ్యాణ్ సార్ నివేదికను కేంద్రానికి అంటే కాషాయ పార్టీ పెద్ద నేతలకు పంపడంతో, ఇప్పుడు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలీదు. మరోవైపు చూస్తే కాషాయ పార్టీ ఏపీ అధ్యక్షుడు మాత్రం కళ్యాణ్ సార్ ను పక్కన పెట్టేసి మరి ముందుకు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తీరు మరింత కంగారు పెట్టేస్తుంది .బిజెపి వ్యవహారం చూస్తుంటే ముందు ముందు తమకు అవకాశం ఇచ్చేలాగా కనిపించడం లేదా అనే అనుమానం సైనికుల్లో వచ్చేసింది. 


అయితే కళ్యాణ్ సార్ మాత్రం ఇంకా మొహమాటం పడుతూ వస్తున్నాడు. సైనికులకు ఇది మరింత అసహనం కలిగిస్తుంది. అయినా  ఎందుకుకళ్యాణ్ సార్ మాత్రం ఇంకా ఇంకా ఏదో మరేదో కాషాయం పార్టీ నుంచి ఆశిస్తున్నట్లు కనిపిస్తున్నారు. సైనికులు మాత్రం ఇంకెందుకు ఈ అవమానాలు బయటకు రా అన్నాయ్ అంటూ పిలుపునిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: