న్యాయ మీమాంస అనే దాని గురించి సరైన వివరణ లేదనే చెప్పుకోవచ్చు. పురాతన కాలంలో ఇద్దరు తండ్రి కొడుకులు మంచులో వెళుతుంటే వారికి మంచులో పెద్ద పాదముద్రలు, చిన్న పాదముద్రలు కనిపిస్తాయి. అయితే ఆ పాద ముద్రలను చూసిన వారు చిన్న పాద ముద్రలు ఉన్న మహిళను కొడుకు పెళ్లి చేసుకోవాలని, పెద్ద పాదముద్రలు ఉన్న మహిళను తండ్రి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే ఇదే విషయంలో వారికి ఆ ఇద్దరు మహిళలు కనిపిస్తారు. కానీ అసలు సమస్య అక్కడే మొదలవుతుంది.


చిన్న పాదముద్రలు ఉన్న మహిళ తల్లి, పెద్ద పాదముద్రలు మహిళ ఆమె కుతూరు. దీంతో కొడుకు అమ్మాయి తల్లిని చేసుకున్నాడు. తండ్రి ఆమె కుతూరు ను చేసుకున్నాడు. దీంతో వారు ఇరువురు ఏం వరుస అవుతారనే పౌరణిక గాథలో న్యాయ మీమాంస పెట్టారు. అలాంటిదే అంతర్జాతీయంగా ఒక కేసు ఇప్పటికీ న్యాయం జరగడం లేదని తెలుస్తోంది.


ఒక లాయర్ వద్ద స్టూడెంట్స్ గా జాయిన్ అవుతాడు ఒక నిరుపేద విద్యార్థి. కానీ అతని దగ్గర డబ్బులు ఏమీ ఉండవు. అయితే గురువు మాత్రం నాకేమిస్తావు అని అడిగితే నాకు మొదటి కేసులో వచ్చిన డబ్బులు అన్ని మీకే ఇస్తాను అని విద్యార్థి గురువుతో ఒప్పందం చేసుకుంటాడు. న్యాయ విద్య పూర్తవుతుంది. కానీ ఎన్నిసార్లు ఫీజు అడిగిన విద్యార్థి డబ్బులు ఇవ్వడం లేదని ఫ్రొఫెసర్ కేసు వేశాడు.


ఇద్దరు లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. ప్రొఫెసర్ మాట్లాడుతూ.. నేను కేసు నెగ్గితే లా ప్రకారం నా ఫీజు నాకు రావాలి. ఒక వేళ ఓడిపోతే శిష్యుడు గెలుస్తాడు కాబట్టి నాకు ఫీజు చెల్లించాలి. స్టూడెంట్ లాయర్ మాట్లాడుతూ.. నేను కేసు నెగ్గితే లా ప్రకారం.. నేను ఆయనకు ఏమీ ఇవ్వనక్కర్లేదు. నేను ఓడిపోతే మా అగ్రిమెంట్ ప్రకారం తొలిఫీజు రాలేదు కాబట్టి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

LAW