
కాగా అంతా గుడికి వెళ్ళేది దేవుని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేస్తాము. ఈ సందర్భంలో గుడి పూజారి మన తలపైన శఠగోపం పెడుతారు. అయితే ఏదో వెళ్లి వస్తున్నారు కానీ...ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకు ఇలా పెడతారో అని...? కారణాన్ని ఒకసారి చూస్తే దేవాలయంలో దైవ దర్శనం అయ్యాక తీర్థం మరియు శఠగోపనం తప్పక తీసుకోవాలి. షడగోప్యమును శఠగోపనం అని కూడా అంటారు. శఠగోపనం అంటే అత్యంత రహస్యం. శఠగోపంను వెండి, రాగి, కంచుతో తయారు చేస్తారు. దీని మీద విష్ణువు పదాలు ఉంటాయి.
అందుకే శఠగోపాన్ని మన తలపై పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అదే విధంగా ఇది మన తలపై పెట్టినప్పుడు అది పెట్టే పూజారికి కూడా వినపడకుండా మన మనస్సులో కోరికను కోరుకోవాలి. ఇది మన తలపై ఉంచినప్పుడు మనలోని ఆవేశం వేడి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. తద్వారా మన మనస్సు శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది. మనము ఆచరిస్తూ వస్తున్న ప్రతి ఒక్క ఆచార వ్యవహారాల్లో అర్ధం పరమార్ధం దాగి ఉంటాయి. ఇప్పటికీ ఎంతోమంది మనకున్న పాత ఆచార సంప్రదాయాలను పాటించడం వలనే మన దేశంపై ఇతర దేశస్థులకు ఎంతో గౌరవం ఉంది.