ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లును కలిగి ఉండాలనేది కోరిక. అలాగే కొంత మంది వారి ఇంటిని ఎంతో ఇష్టంగా వారికి నచ్చిన విధంగా నిర్మించుకుంటారు. ఎంతో ఫ్యాషన్ గా లేటెస్ట్ ఇంటీరియర్ డిజైన్ తో చేయించుకుంటారు. ఇవన్నీ మనకు ఇష్ట ప్రకారం చేయించుకోవచ్చు. కానీ ఒక పూజ గదిని మాత్రం మన ఇష్టంతో పొంతన పెట్టకూడదు. మనం నివసించే ఇంట్లో ప్రశాంతత, ఆనందం, సంతోషం, అష్టైశ్వర్యాభివృద్ధి కావాలంటే... పూజ గది అత్యంత ముఖ్యమైనది. ఎందుకు అంటే దేవుని సంబంధించిన విషయం కాబట్టి శాస్త్రాలు ఏమి చెబుతాయో, పండితులు ఎలా చెప్పారో ఆ విధంగా నిర్మించుకోవాలి. ఇలా చేయడం మీకు మీ ఇంటికి శుభం జరగడం కోసమే.

ఈ పూజ గది నిర్మించే విషయంలో కొన్ని కీలక విషయాలను వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. ముఖ్యముగా పూజాగదికి ఏ కలర్ పెయింట్ వేయాలో అన్నది చాలా కీలకం అన్నది వారి అభిప్రాయం. దీనిని  బట్టి ఆ ఇంటికి తగిన ఫలాలు లభిస్తాయని పండితులు చెబుతున్న మాట. పూజ గది మన ఇంట్లో ఉత్తరం దిక్కు, తూర్పు దిక్కు లేదా ఈశాన్య దిక్కులోనే ఉండాలి. అప్పుడే ఆ ఇంట్లో వారు పూజలు చేస్తే వారికి ఆనందం, సౌభాగ్యం, సంతృప్తి అన్నీ ఉంటాయని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా పూజ గదికి, వంట గది మరియు బాత్రూం దోరగా ఉండేలా చూసుకోవాలి.

మాములుగా మనము చూసినంత వరకు పూజ గదులకు ఆరెంజ్ లేదా పసుపు రంగు వేసుకుంటారు. ఈ రెండు  రంగులను వాస్తు శాస్త్రవేత్తలు సూచించేవారు. ఈ రంగుల వలన ఇంటిలో వారికి మంచి ఆరోగ్యం మరియు బాధ్యతాయుతమైన వ్యవహార శైలి ఏర్పడుతుందట. అలాగే తెలివితేటలు పెరుగుతాయి. మానసికంగా ఎంతో ధృడంగా ఉంటారు. కాబట్టి... మీ ఇంట్లో పూజ గదికి ఈ రెండు రంగుల్లో ఏదో ఒకటి వేసుకోమని వాస్తు శాస్త నిపుణులు చెబుతున్నారు. అవి కాదంటే... వైట్ కలర్ పెయింట్ వేసుకున్నా పర్వాలేదని చెబుతున్నారు. పూజ గదిలో వాడే వస్తువుల రంగులు కూడా మనపై ప్రభావం చూపుతాయట. పూజ గదిలో వీలైనంతవరకూ ఎక్కువ వస్తువులు ఉంచవద్దని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: