
జన్మాష్టమి 2021 పూజ ముహూర్తం పూజ ముహూర్తం 30 ఆగష్టు రాత్రి 11.59 నుండి అర్థరాత్రి 12:44 వరకు ఉంది. జన్మాష్టమి రోజున బాలకృష్ణుడి రూపాన్ని పూజించాలి. గోపాలుడికి దక్షిణ వర్తి శంఖంతో అభిషేకం చేయాలి. అలాగే కుంకుమ కలిపిన పాలతో స్నానం చేయించాలి. కృష్ణుడిని ప్రతిష్ఠించేటప్పుడు, క్రిమ్ కృష్ణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అభిషేకం తరువాత కిష్ణుడి ప్రతిమను బట్టలతో అలంకరించాలి. ఆయనకు ఇష్టమైన వైజయంతి దండ, వేణువు, నెమలి ఈకలు, గంధం, తులసి దండ వేయాలి. తర్వాత ధూప దీపం వెలిగించి ఆయనను పార్థించాలి. ఆయనకు హారతి ఇచ్చి కుటుంబ సభ్యులందరికీ హారతితో పాటు ప్రసాదం ఇవ్వాలి.
ఇక శ్రీ కృష్ణుడు ప్రతి క్షణం వేణువును తన చెంతనే ఉంచుకునేవాడు. అది ప్రేమ, శాంతిని చేకూరుస్తుందని నమ్ముతారు. అందుకే కృష్ణాష్టమి రోజున వెదురు వేణువుతో పూజ చేసి , దానిని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న ఎలాంటి వాస్తు దోషం అయినా సరే నివారణ జరిగిపోతుంది అంటారు. ఇలా చేస్తే మానసిక ప్రశాంతత, భార్యభర్తల మధ్య ఉన్న గొడవలు, కలతలు ఇలా ఏవైనా తొలగిపోతాయని అంటారు. శ్రీకృష్ణుడిని భక్తి శ్రద్ధలతో పూజించి సంతోషంగా ఉండండి.