ప్రదోష ఉపవాసంతో పాటు శివుడిని ఆరాధించడం తరగని ఫలితాలను ఇస్తుంది. ప్రదోష వ్రతం ప్రతి నెల త్రయోదశి తిథి నాడు ఆచరిస్తారు. ప్రతి నెలలో రెండు ప్రదోష ఉపవాసాలు ఉంటాయి. ఒకటి కృష్ణ పక్షంలో, మరొకటి శుక్ల పక్షంలో వస్తుంది. కార్తీక మాసంలోని రెండవ ప్రదోష ఉపవాసం శుక్ల పక్షంలోని త్రయోదశి నాడు ఆచరిస్తారు. శివ భక్తులు నవంబర్ 16 శుక్ల పక్షం రోజున ఈ ప్రదోష వ్రతాన్ని పాటిస్తారు. శివుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఈ వ్రతాన్ని ఆచరించాలని చెబుతారు. అయితే,అనేక ఫలాలను ఇచ్చే ఈ ప్రదోష వ్రతం ఈసారి మంగళవారం నాడు వస్తోంది. దీనిని భౌమ ప్రదోష వ్రతం అని పిలుస్తారు.

భౌమ ప్రదోష వ్రతం రోజున శివుడిని, హనుమంతుడిని పూజించడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చని చెబుతారు. విశ్వాసాల ప్రకారం భౌమ ప్రదోష ఉపవాసం అపారమైన ఫలితాలను ఇస్తుంది. భక్తులెవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆ వెంటనే శివుడు సంతసించి భక్తులకు అనుగ్రహం ఇస్తాడు. అంతే కాదు భక్తుల కష్టాలన్నింటినీ తొలగించి వారి కోరికలన్నీ తీరుస్తారు. ఈ రోజు ఉపవాసంతో పాటు, కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా సులభంగా అప్పు నుంచి విముక్తి పొందవచ్చు.

భౌమ ప్రదోష వ్రతం శుభ సమయం : కార్తీక మాస శుక్ల పక్ష తిథి 16 నవంబర్ 2021 ఉదయం 10.31 గంటలకు ప్రారంభమవుతుంది. ర్తీక మాస శుక్ల పక్షం ముగింపు తేదీ 17 నవంబర్ 2021. మధ్యాహ్నం 12.20 గంటలకు ఉంటుంది. పూజా సమయం సాయంత్రం 6.55 నుండి 8.57 వరకు పూజాది శుభ ముహూర్తాలు. ప్రదోష ఉపవాసం ఎల్లప్పుడూ ప్రదోషకాల సమయంలో అంటే సూర్యాస్తమయం సమయంలో మాత్రమే జరుగుతుంది. ప్రదోష కాలానికి ముందు పూజ చేస్తే పూర్తి ఫలితాలు రావు.

అప్పును వదిలించుకోవాలనుకుంటే, అప్పుల బాధ నుండి విముక్తి పొందడానికి భౌమ ప్రదోషం రోజున హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. దీనితో పాట, ఈ రోజున మంగళదేవుని 21 లేదా 108 నామాలను పఠించడం ద్వారా మీరు త్వరగా రుణ విముక్తి పొందుతారు. ఇది జాతకంలో ఉన్న మంగళ దోషాన్ని శాంతింపజేస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: