చాలామంది ఆర్థికంగా ఎదగాలని ఒక్కో రూపాయి పోగేస్తూ వుంటారు.అలా పోగేసిన ధనంతో పెద్ద పెద్ద వస్తువులను కొనుక్కోవాలని భావిస్తు వుంటారు.కానీ ఒక్కోసారి డబ్బు సహాయం కావాలన్నప్పుడు వేరేవారికి ఇస్తుంటారు.అలా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తే పర్వాలేదు.కానీ కొంతమంది అలాగే ఉంచుకుంటూ ఉంటారు.డబ్బులు ఇచ్చినవారు ఎన్ని సార్లు అడిగినా వారి బాకీ మాత్రం అసలు చెల్లించకుండా ఉంటారు. ఎవరైతే డబ్బులు ఇచ్చి, తిరిగి వెనక్కి ఇప్పిచ్చుకోలేని వారు ఎవరైనా ఉంటారో,అటువంటి వారు మంగళవారం పూట కొన్ని నివారణలు పాటిస్తే వారి డబ్బులు తిరిగి వెంటనే వస్తాయని వేద పండితులు చెబుతున్నారు. మన హిందూ సంప్రదాయంలో కొన్ని పూజలకు కొన్ని అర్థాలు ఉంటాయని,అటువంటి నివారణలు పాటించడం వల్ల,వెంటనే ఆ ఫలితం తక్కుతుందని కూడా చెబుతున్నారు.మరీ మొండి బాకీలు రావాలంటే ఎలాంటి నివారణలు పాటించాలో మనము తెలుసుకుందాం పదండి..

మంగళవారం లక్ష్మి దేవికి ఇష్టమైన రోజుల్లో ఒకటిగా చెప్పవచ్చు.అటువంటి మంగళవారం పూట లక్ష్మీదేవిని ఆరాధించి, ఎర్రటి పూలను సమర్పించాలి.ఇప్పుడు ఏవైనా రెండు పది రూపాయల నోట్లు కానీ,20 రూపాయల నోట్లో కానీ తీసుకొని దానికి పసుపు, కుంకుమ రాయాలి.మరియు సేంట్ కూడా కొట్టాలి.ఈ నోట్ లను లక్ష్మీదేవి ఎదురుగా ఉంచి,రెండు లేదా మూడు దాల్చిన చెక్కలను కూడా  పూజలో ఉంచాలి. ఇలా మంగళవారం ఆ నోట్లను మరియు దాల్చిన చెక్కను బుధవారం పూట తీసి,పది రూపాయలు నోట్లు మరియు దాల్చిన చెక్కలను ఒక దారంతో కట్టాలి.

ఇలా కట్టిన వాటిని వ్యాపార స్థలంలో కానీ,జేబులో కానీ, పర్సులో కానీ,డబ్బును ఉంచె బీరువాలో కానీ ఉంచుకోవాలి.ఇలా ఉంచడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన ప్రవాహాన్ని  కలిగిస్తుంది.దీనితో ఎటువంటి మొండి బాకీలైనా కూడా వెంటనే తిరిగి వస్తాయి.అంతేకాక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కూడా ఈ చిట్కాను పాటించడం వల్ల ధనాకర్షణ కలిగి, వారి సమస్యలు తొందరగా తొలగిపోతాయి.కావున మీరు కూడా ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే,వెంటనే ఈ రెమిడి పాటించి చూడండి

మరింత సమాచారం తెలుసుకోండి: