ఇక మన భారతదేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి .. వాటిలో కొన్ని శివాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి .. ఇప్పటికీ ఆ శివాలయాల్లో జరిగే కొన్ని విషయాలను శాస్త్రవేత్తలు , నిపుణులు అర్థం చేసుకోలేకపోతున్నారు .. మహాశివరాత్రి సమీపిస్తున్న ఈ స‌మ‌యంలో మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని అంతు చిక్కని రహస్యాలతో కూడిన శివాలయాలు గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం . మహాశివరాత్రి పండగ వేల కోటప్పకొండ భ‌క్తులతో కలకలాడుతుంది .. ఇక ఇక్కడ శివుడు దక్షిణామూర్తి రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు .. అయితే ఈ కొండపై ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి .. ఈ కొండ మీద ఒక కాకి కూడా కనిపించదు .. ఎక్కడికి వెళ్ళినా కాకులు ఉంటాయి కానీ కోటప్పకొండ ప్రాంతంలో మాత్రం ఒక్క కాకి కూడా ఉండదు .. అలాగే మరో ప్రత్యేకత ఏమిటంటే భ‌క్తులు ఈ కొండను ఈ దిశ నుంచి చూసిన మూడు శిఖరాలుగా కనిపిస్తాయి . వాటిని బ్రహ్మ విష్ణు మహేశ్వర్లుగా కొలుస్తారు .. అందుకే ఈ కొండను త్రికోటేశ్వర క్షేత్రంగా కూడా పిలుస్తారు. అలాగే కోటప్పకొండ క్షేత్రంలో శివుడు బ్రహ్మచారి రూపంలో కొలువై ఉండటం తో ఇక్కడ అమ్మవారి గుడి ఉండదు .. ఈ కారణంగానే ఈ దేవాలయంలో పెళ్లిళ్లు కూడా జరగవు .. ఎవరైనా జాతకంలో గురుబలం పెంచుకోవాలనుకునే వారు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు .. ఈ ప్రత్యేక ఆలయం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యల్లమంద  గ్రామంలో ఉంది.
 

యాగంటి ఉమామహేశ్వర ఆలయం గురించి కూడా తెలుగు ప్రజలు వినే ఉంటారు .. ఈ ఆలయం పరిసరాల్లో కూడా కాకలు ఉండవు .. పురాణ కథ ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేస్తున్న సమయంలో కాకులు ఆటంకాలు కలిగించాయి .. అందుకే ఆయన శాపం కారణంగా ఇక్కడ కాకులు ఉండవు అంటారు . అలాగే యాగంటి ఆలయంలో ఉండే నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది .. అయితే దీని వెనక గల రహస్యాన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలు కనిపెట్టాలేకపోతున్నారు .. ఇక కాలజ్ఞాన ప్రకారం కలయుగాంతంలో ఈ నంది విగ్రహం ప్రాణం పొంది ముందుకు వెళుతుందని అంటారు .. ఈ ఆలయం కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం లో ఉంది.

 

ఇక తెలంగాణలోని నల్లగొండలో ఉన్న ఛాయ సోమేశ్వర ఆలయంలో కూడా ఎన్నో విశేషాలు ఉన్నాయి .. ఈ ఆలయంలో శివలింగం వెనక ఎప్పుడూ నీడ కనిపిస్తుంది .. దీని వెనక శాస్త్రీయ కారణం ఏమిటి అనేది ఎవరికీ అర్థం కాలేదు. అలాగే నల్లమల అడవుల్లో మహర్షులు తపస్సు చేసిన ప్రదేశంలో ఉమామహేశ్వర ఆలయం ఉంది .. ఈ ప్రాంతంలో నీరు ఎప్పుడూ చల్లగా ఉంటుంది .. అంతేకాకుండా ఏ కాలంలో అయినా 365 రోజులు నిరంతరం నీరు వస్తూనే ఉంటుంది .. ఈ ఆలయం కర్నూలు జిల్లాలోని మన్ననూర్ గ్రామంలో ఉంది. ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అంతుచుకుని ఆలయాలు ఉన్నాయా.

మరింత సమాచారం తెలుసుకోండి: