ఈ సకల లోకాలకు దేవదేవుడు సూర్య భగవానుడు .. ఇక ఈ ఉగాది రోజున ఈ దేవుడిని పూజిస్తే ఎన్నో రకాల దోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు .. స్వామివారిని ఉదయాన్నే దర్శించి పూజా కైంకర్యాలు నిర్వహిస్తే ఈ సంవత్సరం అంతా ఎన్నో శుభాలు కలుగుతాయని అంటారు . అంతేకాకుండా ఉగాది అంటేనే సూర్య భగవానుడికి సంబంధించిన పండగ .. ఆయన మార్పుతోనే నవగ్రహాలు సరికొత్త ప్రాధాన్యతను సంతరించుకుని ఆయా వ్యక్తుల జాతకాలను నిర్ణయిస్తూ ఉంటాయి .. అందుకే ఈ రోజున పంచాంగ శ్రవణం అందరూ వింటారు .. ఇక ఉగాది ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది ..  ఆరోజుకు అధిపతి సూర్యుడు .. కాబట్టి ఉగాది రోజు అనగా ఈరోజు అందరూ (ద్వాదశ రాశులు 27 జన్మ నక్షత్రాలు)  ఆ సూర్య భగవానుడి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలని అంటున్నారు .. అలాగే సూర్య దేవాలయానికి వల్లేని వారు సూర్యుడి ఉప ఆలయాలకు వెళ్లిన మంచి జరుగుతుందని చెబుతున్నారు .  సూర్యుడి ఉపాయాలు అంటే ప్రధాన సూర్య దేవాలయాలు కాకుండా ఇతర దేవాలయాలు సూర్యుడి విగ్రహాన్ని లేదా ప్రతిమను ప్రతిష్టించి పూజలు చేస్తూ ఉంటారు .

ఎవరైతే ఈ ఆలయాలను దర్శించుకోలేకుండా ఉన్నారో వారు ఇంట్లోనే ఓ  చిన్నపాటి ప్రతిమకు పూజ చేసి ఆయన ఆశీస్సులు పొందవచ్చు .. ఇక ఉగాది రోజున స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకోవాలి ఆ నీటిలో ఎర్రటి పుష్పాలు కుంకుమ కలిగిన అక్షింతలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణిః సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని 12సార్లు జపించి సూర్యుడికి అర్ఘ్యం అర్పించాలి .. ఇలా చేస్తే ఈ సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందని అంటారు .

ఒకవేళ పైన చెప్పిన ఏది చేయలేకపోయినా సూర్యుడికి అధిష్టానమైన శ్రీమన్నారాయణ ఆలయాన్ని దర్శించుకోవాలని కూడా అంటున్నారు అంటే ఇలా విష్ణువుకు సంబంధించిన రామాలయం , నరసింహస్వామి ,వెంకటేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకున్న మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు . కాబట్టి ఉగాది రోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి అర్చన లేదా అభిషేకం చేయించుకోవాలి. అలాగే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 21సార్లు జపించాలని కూడా పండితులు చెబుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: