మ‌న తెలుగు వాళ్ల‌కు శ్రీరామ‌న‌వ‌మి అంటే భ‌ద్రాచ‌ల‌మే గుర్తుకు వ‌స్తుంది. శ్రీరామనవమి రోజు భద్రాచలంలో సీతారాముల కల్యాణం కన్నులపండులగా నిర్వహిస్తారు. ఒంటిమిట్టలో చైత్రమాసం పౌర్ణమి రోజు వెన్నెల వెలుగుల్లో కల్యాణం జరిపిస్తారు. ఇంతకీ సీతారాముల పెళ్లి జరిగిన అసలు ప్రదేశం ఎక్కడుంది ?  అన్న‌ది ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌. అయోధ్యలో జన్మించాడు  శ్రీరామచంద్రుడు. మిథిలానగరంలో జన్మించింది సీతమ్మ .. రాముడి మామగారైన జనకుడు పాలించిన రాజ్యమే మిథిలా నగరం


బీహార్ నుంచి నేపాల్ వరకూ ఈ మిథిలా రాజ్యం  ఉందని అంటారు. దీనికే మ‌రో పేరు విదేహ రాజ్యం ... అందుకే సీతమ్మను వైదేహి అంటారు. అప్పట్లో జనకుడు ఉన్న రాజధానే ప్రస్తుతం నేపాల్లో ఉన్న జనక్ పూర్  అంటారు. ఈ జనక్ పూర్ లోనే భూమిని దున్నుతుండగా సీతమ్మ తల్లి ఉద్భవించింది. రాముడితో సీత‌మ్మ త‌ల్లి వివాహం కూడా ఇక్కడే జరిగింది. 1910లో వృషభాను అనే నేపాల్ రాణి ‘ జానకీ మందిర్ ’ పేరుతో అక్క‌డ వేల గజాల విస్తీర్ణంలో 150 అడుగుల ఎత్తున్న ప్రాకారంతో, పాలరాతి గోడలూ, అద్దాల మేడలతో ఓ ఆల‌యం నిర్మించారు. అప్ప‌ట్లోనే ఆ ఆల‌యానికి రు .. 9 ల‌క్ష‌లు ఖ‌ర్చ‌య్యాయ‌ట‌.


జానకీమందిర్ నిర్మించిన ప్రాంతంలోనే సీతాదేవి శివ ధనుస్సుని పూజించిందని స్థలపురాణం చెపుతుంది. ఈ మండ‌పం లోని నైరుతి దిక్కున పెద్ద వివాహ మండపం ఉంది. ప్ర‌తి యేటా మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున ఇక్కడ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. ఆ రోజే సీతారాముల వివాహం జరిగిందని అక్కడి ప్రజల నమ్మకం..అయితే తెలుగువారు శ్రీరామనవమి రోజునే  కల్యాణం నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఇక గ‌తంలో మ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేపాల్ ను సంద‌ర్శించు కున్న‌ప్పుడు కూడా ఈ ఆల‌యాన్ని సంద‌ర్శించు కోవ‌డంతో ఇది బాగా పాపుల‌ర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: