ముఖ్యంగా నాల్గవ స్థానంలో వచ్చిన కేదార్ జాదవ్ వచ్చి కావాల్సిన రన్ రేట్ ను మరింత పని చేశాడు.. దీంతో భారత జట్టు పై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతంగా రాణించి మరో వరల్డ్ కప్ లో కూడా కీలక పాత్ర పోషిస్తాడు అని అనుకున్నారు అందరు. కానీ కేదార్ జాదవ్ ధోని కీలక సమయంలో బ్యాటింగ్ చేసిన తీరు ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ ఇద్దరి కారణంగానే టీమిండియా కనీసం ఫైనల్ కి కూడా చేరుకోలేక పోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ధోని బ్యాటింగ్ పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి క్రికెట్ దూరంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యింది.
కోల్కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ మొదట బౌలింగ్ చేసింది. ఈ క్రమంలోనే కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్లను కట్టడి చేసి 167 పరుగులకే కట్టడి చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఓపెనర్లు అద్భుతంగా రాణించడంతో సీఎస్కే అలవోకగా మ్యాచ్ గెలుస్తుంది అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత క్రీస్తు లోకి వచ్చిన కేదార్ జాదవ్.. అటు వెంటనే క్రీజులోకి వచ్చిన ధోని బ్యాటింగ్ తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. బౌండరీలు బాదాల్సిన సమయంలో కేదార్ జాదవ్ టెస్టు మ్యాచ్ లాగా ఆడుతూ... ప్రతి బాల్ ని డిఫెన్స్ చేస్తూ కనీసం ఒక్క రన్ కూడా తీయలేదు. ఇక ధోనీ అయినా సిక్సర్లు బాదుతాడు అనుకుంటే కేవలం 1, 2 రన్స్ సరిపెట్టుకోవడం తో చివరికి చెన్నై కి ఓటమి తప్పలేదు.