కానీ ఈ అతిధి ఎవరు అన్న విషయంపై చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే బీసీసీఐ నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం బీసీసీఐ అధ్యక్షుడు గా ఉన్న సౌరవ్ గంగూలీ ఫైనల్ మ్యాచ్ కు అతిథిగా రావాలని వెస్ట్ బెంగాల్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీకి అహ్వనం పంపినట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ మరియు సౌరవ్ గంగూలీకి మధ్యన ఉన్న సాన్నిహిత్యం, అలాగే ఒక లేడీ పొలిటికల్ లీడర్ గా మమతా అంటే గౌరవం వంటి కారణాల వలన ఈమెను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. పైగా ఈమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈమెను పిలిచినట్లు సమాచారం. కానీ వాస్తవానికి ఆమె ఇప్పుడు రాష్ట్రంలో లేదట...వచ్చాక ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మరి సౌరవ్ ఆహ్వానానికి మమతా ఓకె చెబుతుందా లేదా అన్నది చూడాలి. మరి మమతా వస్తారా రారా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీని కాదని ఒక సీఎంను ముఖ్య అతిధిగా ఆహ్వానించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం పొలిటికల్ గా ఎంత దూరం వెళుతుందా అన్నది తెలియాల్సి ఉంది.