ఈ క్రమంలోనే రెగ్యులర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ దూరం కావడంతో చివరికి అటు జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న మోయిన్ అలీ కి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2 - 1 తేడాతో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది వెస్టిండీస్ జట్టు. అయితే ఇక టి20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది అని చెప్పాలి. ఆ తర్వాత రెండవ టి20 మ్యాచ్ లో కాస్త కుదుర్చుకున్నట్లు కనిపించినప్పటికీ కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించడం గమనార్హం. ఇక చివరి వరకు కూడా రెండవ టీ 20 మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగానే సాగింది.
రెండవ టి20 మ్యాచ్ లో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు మూడో మ్యాచ్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తోంది అని అందరూ అనుకున్నారు. కానీ చివరికి మూడో టి20 మ్యాచ్ లో కూడా ఓటమి చవిచూసింది ఇంగ్లాండ్ జట్టు. అయితే 3 టి20 మ్యాచ్ లలో కూడా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు అనే చెప్పాలి. మూడు మ్యాచ్ లలో కలిపి కేవలం 30 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు తాత్కాలిక కెప్టెన్ గా మోయిన్ అలీ సెలెక్ట్ కావడంతో అతని కెప్టెన్సీలో జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుంది అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా మోయిన్ అలీ ఐపిఎల్ లో చెన్నై జట్టులో ఉన్నాడు