మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా తన బ్యాటింగ్ లో జోరు తగ్గలేదు అని నిరూపిస్తూ ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అవసరమైన ప్రతిసారి అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ధోని అద్భుతమైన మెరుపులు మెరిపిస్తూ ఉండటంతో అభిమానులందరూ కూడా ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇకపోతే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని అదరగొట్టాడు. చివర్లో వచ్చి మెరుపులు మెరిపించి ధోనీ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించాడు. 156 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇక చివరి ఓవర్లలో ఓడిపోతుందేమో అన్న విధంగా మారిపోయింది పరిస్థితి.


 చివరికి ఒక్క ఓవర్లోనే 17 పరుగులు కావాల్సి ఉన్న సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ అదరగొట్టాడు. ఏకంగా ధోనీ ఒక్కడే 16 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్ 2 ఫోర్లు ఉండడం గమనార్హం. ధోని ఫినిషింగ్ టచ్ తోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ను ఇరు జట్ల కెప్టెన్ లు కూడా మెచ్చుకున్నారు అని చెప్పాలి. మ్యాచ్ జరిగిన తీరు చూసి చాలా కంగారు పడ్డాను. కానీ క్రికెట్ లోనే అత్యుత్తమ ఫినిషర్ ఉండడంతో మేం గెలుస్తామనే నమ్మకం మాత్రం ఉంది   మహేంద్రసింగ్ ధోని  జట్టు కోసం వరుస విజయాలు అందిస్తూనే ఉన్నాడు.


 అదే సమయంలో మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు అంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత మాట్లాడిన రోహిత్ శర్మ మా బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను చివరి వరకు తీసుకెళ్లారు. కానీ ధోని ఎంత గొప్ప ఆటగాడు అందరికీ తెలుసు. అతడు కొండంత ఎత్తులో నిలబడి చెన్నై సూపర్ కింగ్స్ కు విజయాన్ని అందించాడు. మా ఓటమికి కారణం అదే అంటు చెప్పుకొచ్చాడు. అయితే చెన్నై తో జరిగిన మ్యాచ్లో మేము శుభారంభం చేయలేదు అన్నది నిజమే అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl