![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/sports/libra_libra/kohlifc1129f4-abce-4d76-b980-88c720fcdf29-415x250.jpg)
ప్రతి మ్యాచ్ లో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరికి నిరాశ పరిచి వెనుదిరగడం లాంటివి చేస్తూ ఉన్నాడు విరాట్ కోహ్లి. తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకుంటూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. మూడవ స్థానంలో బ్యాటింగ్ కి వస్తున్న విరాట్ కోహ్లీ కనీస పరుగులు చేయలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలోనే ఇక ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు కెప్టెన్ డూప్లేసెస్ అభిమానులందరికీ గుడ్ న్యూస్ చెప్పాడు విరాట్ కోహ్లీ ఎప్పటిలాగా మూడవ స్థానంలో కాకుండా ఓపెనర్గా బరిలోకి దిగుతాడు అంటూ గుడ్ న్యూస్ చెప్పాడు.
దీంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోయారూ. గతంలో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన సందర్భాలు ఉండడం.. సెంచరీలు కూడా చేయడంతో ఈ సారి కూడా తిరుగులేదు అని భావించారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం అదే రీతిలో నిరాశపరిచాడు. పది బంతుల్లో ఆడి 9 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఇక ప్రసిద్ క్రిష్ణ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో అభిమానులు మరింత నిరాశలో మునిగిపోయారు. ఓపెనర్ గా వస్తున్నాడు ఇక ఈ సారి సెంచరీ చేయడం ఖాయం అని అందరూ అనుకుంటే.. కోహ్లీ మాత్రం తన తీరు మార్చుకోలేదు. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు..