24 బంతుల వరకు కూడా ఎంతో నెమ్మదిగా ఆచితూచి ఆడుతూ పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా గేర్ మార్చాడు. ఇక జట్టును గెలిపించాలంటే బ్యాట్ జులిపించాల్సిందే అని నిర్ణయించుకొని.. సిక్సర్లు పోరులతో చెలరేగిపోయాడు. తనదైన శైలిలో సొగసైన షాట్లు ఆడుతూ.. అటు పాకిస్తాన్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు అని చెప్పాలి. 53 బంతుల్లో 82 పరుగులు చేసి ఇక భారత జట్టుకు అనూహ్యమైన విజయాన్ని అందించాడు.
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే కోహ్లీ ఇన్నింగ్స్ పై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం సైతం ప్రశంసలు కురిపించాడు. టీమిండియా గెలుపు క్రెడిట్ అంతా విరాట్ కోహ్లీ కే దక్కుతుందని బాబర్ అజాం చెప్పుకొచ్చాడు. చాలామంది కోహ్లీ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఫామ్ కన్నా క్లాస్ శాశ్వతం అని కోహ్లీ ఈరోజు రుజువు చేశాడు అంటూ బాబర్ చెప్పుకొచ్చాడు. భారత్ ఓడిపోతుంది అనుకున్న దశలో విరాట్ కోహ్లీ మాయాజాలం చేశాడు అంటూ బాబర్ వ్యాఖ్యానించాడు ఇక స్టేడియం నుంచి ఒక్కరు కూడా వెళ్లిపోలేదని ఇంతకంటే క్రీడలకు మంచి ప్రచారం ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు.