ఏకంగా 158 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 15 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల కోల్పోయి 93 పరుగులు చేసింది ఇక అంతలోనే వర్షం రావడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఐర్లాండ్ జట్టు 5 పరుగులు తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించిందని మ్యాచ్ రిఫరీలు ప్రకటించారు అయితే ఐర్లాండ్ విజయంతో టీమిండియా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు చేసుకోవడానికి పెద్ద కారణమే ఉంది. 2011 వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
ఏకంగా పసికూనా ఐర్లాండ్ ముందు ఇంగ్లాండ్ జట్టు 328 పరుగుల భారీ టార్గెట్ ఉంచినప్పటికీ.. ఐర్లాండ్ మాత్రం 49.1 ఓవర్ లలో టార్గెట్ చేదించి ఇంగ్లాండ్కు షాకించింది. అయితే ఇక ఆ ఏడాది జరిగిన వరల్డ్కప్ లో టీమిండియా విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఇక ఇప్పుడూ మళ్ళీ 11 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ను ఓడించింది ఐర్లాండ్ జట్టు. తద్వారా మరోసారి భారత జట్టు ఐసీసీ టైటిల్ గెలవబోతుందని సంకేతాలు ఇచ్చిందని టీమ్ ఇండియా అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఈ విషయం గురించి తెలిసి ఈ లాజిక్ ఏదో బాగుంది అంటూ టీమిండియ అభిమానులు అందరూ కూడా బాగా కనెక్ట్ అయిపోతున్నారు అని చెప్పాలి.