అయితే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో t20 లకు ఎంతగానో ఆదరణ పెరిగిపోయిన నేపథ్యంలో.. టెస్ట్ క్రికెట్ భవితవ్యం ప్రమాదకరంగా మారిపోయింది. ఎందుకంటే ఇక ఇటీవల కాలంలో టి20 ఫార్మాట్ ని చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. సుదీర్ఘంగా సాగే టెస్ట్ ఫార్మాట్ లోని మ్యాచ్లను చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలోనే ఎక్కడైనా టెస్ట్ మ్యాచ్ జరిగింది అంటే చాలు స్టేడియంలో ఇక ప్రేక్షకులు లేక పూర్తిగా అంతట ఖాళీగా కనిపిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో టెస్ట్ క్రికెట్ ను కాపాడాల్సిన అవసరం ఉందని ఎంతోమంది స్టార్ క్రికెటర్లు కూడా పిలుపునిస్తున్నారు.
ఇలాంటి సమయంలో కొంతమంది ఏకంగా టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటూ ఉండటం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇక ఇటీవల టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై వెస్టిండీస్ క్రికెటర్ జాసన్ హోల్డర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా టూర్ కి వెళ్ళకపోవడానికి గల కారణమే వెల్లడించాడు. ఈ ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాను అంటూ జాసన్ హోల్డర్ తెలిపాడు. ఆస్ట్రేలియా టూర్ కు వెళ్ళకపోయినంత మాత్రాన తాను టెస్టులకు దూరం అని అనుకోవద్దు అంటూ తెలిపాడు. టెస్ట్ క్రికెట్ బతకాలి అంటే ఏడాదిలో దానికోసం నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకోవడమే ఉత్తమమైన మార్గం అంటూ చెప్పుకొచ్చాడు జాసన్ హోల్డర్.