అయితే ఇక ఇప్పుడు భారత జట్టు ఇండియా పర్యటనకు వచ్చింది. ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా అటు విరాట్ కోహ్లీ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్లకు అందుబాటులో లేడు. వ్యక్తిగత కారణాలతో అతను జట్టుకు దూరంగానే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అతను లేని టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్ లో తడబడి ఓడిపోయింది. అయితే మొదటి రెండు టెస్టులకు అందుబాటులో లేకపోయినా.. మిగిలిన మూడు టెస్టులకు అతను జట్టులోకి వచ్చేస్తాడు అని అందరూ ఆశలు పెట్టుకున్నారు.
కానీ అందరి ఆశలు అడియాశలు అయ్యేలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన టెస్ట్ మ్యాచ్లకు కూడా అతను అందుబాటులో ఉండడం కష్టమే అన్నది తెలుస్తుంది. ఏకంగా తన తల్లి లివర్ సమస్యతో బాధపడుతున్నందుకు విరాట్ కోహ్లీ బ్రేక్ తీసుకున్నట్లు సమాచారం. ఆమె పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఇక ఈ సిరీస్ లోని మిగతా మూడు టెస్టులకు కూడా విరాట్ కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉందట. మరోవైపు ఇప్పటివరకు తన రీ ఎంట్రీ గురించి విరాట్ కోహ్లీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బీసీసీఐ అధికారి అధికారి ఒకరు తెలిపారు. కాగా ఇప్పటికే జట్టుకు రవీంద్ర జడేజా, కే.ఎల్ రాహుల్ లాంటి కీలక ప్లేయర్ల దూరం కాగా ఇక విరాట్ కోహ్లీ కూడా మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండడు అని తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.