బక్కపలుచుగా కనిపించే ఈ కుర్రాడు భారీ సిక్సర్లు కొడుతూ ఉంటే చూస్తున్న ప్రేక్షకులు సైతం ఆశ్చర్యంలో మునిగిపోయారు. అయితే ఇక ఇలా సెలెక్టర్ల చూపును ఆకర్షించి టీమ్ ఇండియాలోకి వచ్చాడు. టీమిండియాలోకి వచ్చిన తక్కువ సమయంలోనే తన బ్యాటింగ్ ఇంపాక్ట్ ఏంటి అన్న విషయాన్ని అందరికీ నిరూపిస్తూ ఉన్నాడు. అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్నాడు. సీనియర్లు విఫలమవుతున్న సమయంలో నేనున్నాను నాయనమ్మ అని ఇంద్ర సినిమాలో చిరంజీవి చెప్పినట్లు నేనున్నాను రోహిత్ భయ్యా అని టీమిండియాకు ఒక భరోసాని ఇస్తున్నాడు యశస్వి.
ఇక ఇటీవల తన బ్యాటింగ్ సామర్థ్యం ఏంటి అన్న విషయాన్ని మరోసారి నిరూపించాడు. ఇక విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో అందరూ విఫలమవుతున్న సమయంలో యశస్వి జైష్వాల్ మాత్రం 179 పరుగులతో వీరుచితమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఎన్నో రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ పై ఒక్క రోజులోనే ఎక్కువ రన్స్ కొట్టిన బ్యాట్స్ మెన్ జాబితాలో చేరిపోయాడు. యశస్వి జైస్వాల్. 2016లో కరుణ్ నాయక్ 232 పరుగులు చేసి టాప్ లో ఉండగా.. రెండో స్థానంలో గవాస్కర్ 1979లో 179 పరుగులు చేసి ఉన్నాడు. ఇక ఇప్పుడు యశస్వి జైస్వాల్ గవాస్కర్ సరసన చేరిపోయాడు. ఇక తొలిరోజే అత్యధిక రన్స్ కొట్టిన జాబితాలోను ఆరో స్థానంలో నిలిచాడు జైస్వాల్. ఇక ఈ లిస్టులో పాకిస్తాన్ పై 2004లో 228 పరుగులు చేసి టాప్ లో ఉన్నాడు సెహ్వాగ్.