
అయితే ఇక సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ దృశ్య అతని గురించి ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోతోంది. అయితే గత కాలం నుండి కోహ్లీ గురించి ఒక విషయంపై చర్చ జరుగుతూ ఉంది. ఎప్పుడు టీమిండియా కు మూడు ఫార్మట్లలో అందుబాటులో ఉండే విరాట్ కోహ్లీ ఎందుకు గత కొంతకాలం నుంచి ఇక తరచూ సెలవులు తీసుకుంటున్నాడు అనే విషయంపై చర్చ జరుగుతుంది. అయితే కోహ్లీ తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడం కారణంగానే అతను లీవ్ తీసుకున్నాడు అంటూ వార్తలు వచ్చిన.. అదంతా నిజం కాదు అని కోహ్లీ తమ్ముడు క్లారిటీ ఇచ్చాడు.
మరి ఇంకెందుకు కోహ్లీ లీవ్ తీసుకున్నాడు అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే ఇటీవల కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఈ విషయంపై నోరు జారీ అందరికీ నిజం చెప్పేశాడు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు అంటూ ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. అందుకే విరాట్ కోహ్లీ ప్రస్తుతం వరుసగా సెలవులు తీసుకుంటున్నాడు అంటూ ఏబీడీ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపాడు ఎబి డివిలియర్స్.