
అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఆకాశం నుంచి ఒక్కసారిగా పిడుగు పడి కేవలం చూస్తూ చూస్తుండగానే సెకండ్ల వ్యవదిలో చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అందుకే వర్షం కురుస్తున్నప్పుడు గానీ ఉరుములు ఉరుముతున్నప్పుడు గానీ కాస్త జాగ్రత్తగా ఉండాలని అందరూ చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏకంగా విధి పగబట్టినట్లుగానే వ్యవహరిస్తూ.. ఇలాంటి పిడుగుపాటుతో ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి.
ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏకంగా గ్రౌండ్ మధ్యలో పిడుగు పడింది. అది కూడా మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్ పై పిడుగు పడటంతో అతను ఒక్కసారిగా కుప్ప కూలిపోయి ప్రాణాలు వదిలాడు. ఈ షాకింగ్ ఘటన ఇండోనేషియాలోని సిలువగీ స్టేడియంలో వెలుగులోకి వచ్చింది. ఎఫ్ సి బాండుంగ్, ఎఫ్బీఐ సుభాన్ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఉన్న ప్లేయర్ పై పిడుగు పడింది. దీంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే మిగతా ప్లేయర్లు అతని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ ప్లేయర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.