ఈ క్రమంలోనే దేశవాలి క్రికెట్ ఆడి అటు మంచి ప్రదర్శన చేసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాము అని నిరూపించుకున్నప్పటికీ ఎంతో మంది సీనియర్ ప్లేయర్లు మాత్రం మళ్ళీ భారత జట్టులోకి రాలేకపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా టీమ్ ఇండియాలో చోటు దక్కుతుందేమో అని ఎదురుచూసి చివరికి రిటైర్మెంట్కు సిద్ధమవుతున్నారు చాలామంది క్రికెటర్లు. అయితే ఇటీవల ఏకంగా భారత క్రికెట్లో ఒకేసారి ఐదుగురు క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
ఈ ఏడాది రంజి సీజన్ తర్వాత ఏకంగా ఐదుగురు దేశవాళి క్రికెటర్లు రిటైర్ కాబోతున్నారు అని చెప్పాలి. బెంగాల్ కు చెందిన మనోజ్ తివారి, ఝార్ఖండ్ కు చెందిన సౌరబ్ తివారి, జార్ఖండ్ కు చెందిన వరుణ్ అరుణ్, ముంబైకి చెందిన ధవల్ కులకర్ణి, విదర్భకు చెందిన ఫయాజ్ ఫజల్ ఇక క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధమయ్యారు. అయితే ఒకప్పుడు టీమిండియాకు ఈ ఐదుగురికి క్రికెటర్లు కూడా ప్రాతినిధ్యం వహించారు. కానీ ఎక్కువగా మ్యాచ్లు ఆడలేదు. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం అద్భుతంగా రానించి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసారు అని చెప్పాలి. ఇలా అయిదుగురు క్రికెటర్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు.