దీంతో ఈ ఐపీఎల్ పోరు మరింత రసవత్తరంగా మారిపోయింది. అయితే ఎంతోమంది ప్లేయర్లు అత్యుత్తమమైన ప్రదర్శన చేసి అరుదైన రికార్డులు కూడా సృష్టిస్తున్నారు. అదే సమయంలో కొంతమంది ప్లేయర్లు చెత్త ప్రదర్శనలు కారణంగా ఇక ఎన్నో వరల్డ్ రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటూ ఉండడం గమనార్హం. కాగా ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగకుండా అద్భుతంగా రాణించిన ఢిల్లీ జట్టు.. 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో ఇరు జట్లు బ్యాట్స్మెన్లు పరుగుల ప్రవాహాన్ని కొనసాగించారూ అని చెప్పాలి.
కాగా ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ ఒక చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా ఒక అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు అని చెప్పాలి. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో మోహిత్ శర్మ నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ కూడా తీయకుండానే 73 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో చెత్త రికార్డు అతని ఖాతాలో వచ్చి చేరింది. గతంలో ఈ రికార్డు బాసిల్ తంబి పేరిట ఉండేది. ఏకంగా అతను 70 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ రికార్డును మోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ఇక వీరి తర్వాత యష్ దయాల్ 69, రీస్ టాప్లే 68 పరుగులు ఇచ్చిన బౌలర్లుగా ఉన్నారు.