ప్రతి మ్యాచ్ లో కూడా 200 ప్లస్ స్కోర్ లు నమోదు అవుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక బౌలర్లు ఎక్కడ బంతివేయాలో తెలియక తికమక పడిపోతున్నారు. అయితే ఇక ఈ ఐపీఎల్ సీజన్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమ్స్ లో అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక దాదాపు ఏడాదిన్నర పాటు క్రికెట్ కి దూరంగా ఉన్న పంత్ మళ్ళీ ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అంతే కాకుండా ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా కూడా బాధ్యతలు చేపట్టి జట్టును ముందుకు నడిపించడం మొదలుపెట్టాడు.
దీంతో ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇక ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం తమ ప్రదర్శనతో నిరాశ పరుస్తూనే ఉంది. వరుస ఓటములతో సతమతమవుతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 257/4 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసి రికార్డు సృష్టించింది. 2011లో ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన 231/4 రన్స్ మాత్రమే ఇప్పుడు వరకు ఆ జట్టుకు అత్యధికం. కాగా ఇక ఇటీవల ముంబైతో మ్యాచ్లో ఆ రికార్డును వెయిట్ చేసింది. ఇక ఒకానొక దశలో 270 పరుగులు చేసేలా కనిపించినప్పటికీ చివరికి 257 పరుగులకే పరిమితమైంది.