మిస్టర్ కూల్ కెప్టెన్గా అతను సాధించిన విజయాలు మాటల్లో వర్ణించలేనివి అనడంలో సందేహం లేదు. అయితే అందరూ క్రికెటర్ల లాగా మహేంద్రసింగ్ ధోని అటు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడు. కానీ ధోనీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది అని చెప్పాలి. అయితే ధోనిని ఒక్కసారైనా కలవడానికి అటు అభిమానులు అందరూ కూడా ఏకంగా మైదానంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు సెక్యూరిటీని దాటుకొని మరి స్టేడియంలోకి దూసుకు రావడం చూస్తూ ఉంటాం.
ధోని కూడా తన అభిమానులందరికీ కూడా అదే స్థాయిలో గౌరవం ఇస్తూ ఉంటాడు. అయితే ఇటీవల ipl లో భాగంగా గుజరాత్, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో ఒక అభిమాని మైదానంలోకి దూసుకు వచ్చి ధోని కౌగిలించుకున్నాడు. అయితే ఆ అభిమానికి సహాయం చేస్తానని ధోని హామీ ఇచ్చాడట. నేను ధోని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లాక.. నాకు శ్వాస సమస్యలు ఉన్నట్లు ధోని గుర్తించారు. సర్జరీ చేయిస్తానని మాట కూడా ఇచ్చారు. నీకేం కాదు ఏం కానివ్వను అని అభయమిచ్చారు అంటూ అభిమాని చెప్పుకొచ్చాడు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి లాక్కెళ్ళక ముందు ధోని అభిమానితో మాట్లాడటం టీవీల్లో కనిపించింది. ఈ విషయం తెలిసి ధోని ఫ్యాన్స్ మరింత గర్వపడుతున్నారు మీ అభిమానిని అయినందుకు చాలా గర్వంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు