అందుకే ప్రతి ఏడాది కూడా ఇక టైటిల్ గెలిచిన క్షణాలను తెలుగు క్రికెట్ అభిమానులు అందరూ కూడా గుర్తు చేసుకుంటారు. 29వ తేదీన సన్ రైజర్స్ టైటిల్ అందుకోగా.. ఇక ఇదే రోజును సోషల్ మీడియాలో టైటిల్ గెలిచిన క్షణాలను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెట్టడం చేస్తూ ఉంటారు. అయితే అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి ఎంతో స్పెషల్ అయిన ఈరోజును ఆ ఫ్రాంచైజీ మర్చిపోయింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. 2016 మే 29వ తేదీన ఆర్సిబి పై ఫైనల్ లో గెలిచి తొలిసారి ఐపిఎల్ కొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆరోజు ఎంతో స్పెషల్.
అయితే నిన్న మే 29వ తేదీ కాగా.. అటు ఆ జట్టు యాజమాన్యం ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే డేవిడ్ వార్నర్ పై ఉన్న కోపం కారణంగానే సన్రైజర్స్ యాజమాన్యం ఈ పోస్టులు పెట్టలేదు అని అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడు కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించిన డేవిడ్ వార్నర్ కప్పు గెలిచిన సెలబ్రేషన్స్ కు సంబంధించి ప్రతి ఫోటోలో వీడియోలో ఉంటాడు. కాబట్టి ఇక ఈ సందర్భాన్ని సన్రైజర్స్ గుర్తు చేసుకోవడం లేదని ఎంతోమంది కామెంట్స్ చేస్తున్నారు.