దీంతో ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలలో మాత్రమే ఈ రెండు టీమ్స్ మధ్య పోరు జరుగుతూ ఉంటుంది. దీంతో సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి జరిగే ఈ బిగ్ ఫైట్ ని చూసేందుకు అందరూ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం యూఎస్, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో అటు అందరూ ఎదురుచూసిన మ్యాచ్ నేడు జరగబోతుంది. ఏకంగా నేడు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాబోయే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పోరును చూసేందుకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే అటు టీమిండియా ఇంకోవైపు పాకిస్తాన్ జట్లు కూడా ఈ హై వోల్టేజ్ పోరు కోసం సిద్ధమవుతున్నాయి. అయితే ఇలా దాయాదుల పోరుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సెషన్ లో గాయపడినట్లు తెలుస్తుంది. నిన్న సాయంత్రం నెట్ ప్రాక్టీస్ లో హిట్ మ్యాన్ బొటనవేలికి గాయమైందట. ప్రాక్టీస్ పిచ్ లో బంతి ఓవర్ బౌన్స్ అవుతుందని.. icc కి బీసీసీఐ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే రన్ మిషన్ విరాట్ కోహ్లీ సైతం ఈ పిచ్ పై ఇబ్బంది పడ్డాడట. ఐర్లాండ్తో మ్యాచ్లో రోహిత్ శర్మ గాయంతో గ్రౌండ్ నుండి వెనుదిరిగిన విషయం తెలిసిందే. మరి నేడు జరగబోయే మ్యాచ్ లో రోహిత్ బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.