ఇండియా లో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పటికీ ఎందుకో క్రీడాభిమానులు అందరూ కూడా క్రికెట్ ని అమితం గా ఇష్టపడుతూ ఉంటారు. ఇక క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఎంతోమంది యువకులు కూడా క్రికెట్ ని ఫ్యాషన్ గా మార్చుకుంటూ అటువైపుగా అడుగులు వేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాము.


 ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను ఎంతో అద్భుతంగా ఉపయోగించుకుంటూ అదరగొడుతున్నారు ఎంతోమంది ఆటగాళ్లు. దీంతో భారత క్రికెట్లో కొత్త ప్రతిభకు కొలువ లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా సత్తా చాటుతూ ఇక టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో యంగ్ ప్లేయర్స్ ఎంతల విధ్వంసం సృష్టించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది బ్యాటింగ్ తో ఇంకొంతమంది బౌలింగ్ తో అదరగొట్టేశారు. టీమిండియా ఫ్యూచర్ స్టార్స్ తామే అన్న విషయాన్ని నిరూపించారు.


 ఇలా ఐపీఎల్లో అదరగొట్టిన ఎంతో మంది యంగ్ స్టర్స్ కి ఇప్పుడు  అదృష్టం తలుపు తట్టింది. ఏకంగా టీమ్ ఇండియా తరపున ప్రాతినిద్యం వహించే  అవకాశం వచ్చింది.  నలుగురు ఆటగాళ్లు తొలిసారి భారత్ తరపున ఆడే అవకాశం దక్కించుకున్నారు. తెలుగు తేజం నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్పాండేలకు ఇక బిసిసిఐ సెలెక్టర్ ల నుంచి పిలుపు వచ్చింది. వీరంతా తొలిసారి భారత జట్టు తరఫున ఆడబోతున్నారు. భారత జట్టు జెర్సీ ధరించాలి అనే కలను నిజం చేసుకోబోతున్నారు. అయితే టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన జురెల్ ఇక ఇప్పుడు జంబాబ్వేతో సిరీస్లో టి20లోకి కూడా రాబోతున్నాడు. మరి భారత జట్టు తరఫున ఎలా రాణించబోతున్నారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: