వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియా.. గత కొన్ని నెలల నుంచి ఐసీసీ టోర్నిలలో సత్తా చాటుతున్నప్పటికీ.. టైటిల్ పోరులో మాత్రం వెనకబడిపోతూనే ఉంది  ఎందుకంటే ఇక అద్భుతంగా రాణిస్తూ టైటిల్ కు ఎంతో చేరువగా వెళుతున్న టీమిండియా.. చివరి అడుగులో మాత్రం తడబడుతూ అభిమానులు అందరికీ కూడా నిరాశ మిగులుస్తుంది. దీంతో అప్పుడెప్పుడో 2011లో ధోని కెప్టెన్సీ లో గెలిచిన వరల్డ్ కప్ తప్ప ఇప్పటివరకు టీం ఇండియా ఒక్క ప్రపంచ కప్ టోర్నీ కూడా గెలవలేదు.


 అయితే ప్రస్తుతం వెస్టిండీస్ యుఎస్ వేదికగా జరుగుతున్న t20 ప్రపంచ కప్ టోర్నీలో మాత్రం తప్పకుండా విజయం సాధించి సత్తా చాటాలని అనుకుంటుంది భారత జట్టు. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ ను ముద్దాడాలి అనే పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియా అదే రీతిలో రాణిస్తుంది. ఏకంగా అంచనాలకు మించి ప్రదర్శన చేస్తూ అదరగొడుతుంది. ప్రత్యర్థులు అందరిని కూడా ఓడిస్తూ జైత్రయాత్ర కొనసాగిస్తుంది. గత ఏడాది జరిగినా వన్డే ప్రపంచ కప్ లో లాగానే ఈ ఏడాది జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో కూడా ఒక్క ఓటమి లేకుండా టీమిండియా ఫైనల్ వరకు దూసుకు వెళ్ళింది అని చెప్పాలి.


 ఇటీవల సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా ఘనవిజయాన్ని అందుకుని ఫైనల్లో అడుగు పెట్టింది. అయితే గత ఏడాది టోర్ని లలో రెండుసార్లు ఫైనల్స్ లో టీమిండియాని ఓడించిన ఆస్ట్రేలియాపై సూపర్ 8 లో ప్రతి కారం తీర్చుకొని.. ఆ జట్టును ఇంటికి పంపించడంలో సక్సెస్ అయింది. ఇటీవల సెమీఫైనల్ లో ఇక గతంలో ఓ సెమి ఫైనల్లో టీమ్ ఇండియాని ఓడించిన ఇంగ్లాండ్ జట్టుఫై ప్రతీకారం తీర్చుకుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత టీమిండియా ఫైనల్ లో అడుగు పెట్టింది. ఇలా వరల్డ్ కప్ టైటిల్ గెలవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఫైనల్ లో గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: