వెస్టిండీస్ యూఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్న టీమిండియా.. వరల్డ్ కప్ టైటిల్ విజేతగా   నిలిచింది. వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశానికి చేరుకోగా భారత ఆటగాళ్లకు ఘనస్వాగతం లభించింది. మరీ ముఖ్యంగా ముంబై వీధుల్లో ఇక భారత ఆటగాళ్లు చేసిన ర్యాలీకి లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఇక వారి మధ్య వరల్డ్ కప్ ట్రోఫీని ప్రదర్శిస్తూ ఇక భారత ఆటగాళ్లు వాంకాడే స్టేడియం కు చేరుకున్నారు. అక్కడ ఇక బిసిసిఐ ఒక ఈవెంట్ నిర్వహించింది అన్న విషయం తెలిసిందే.


 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆటగాళ్ళను ఘనంగా సన్మానం చేసింది. అయితే ఈ కార్యక్రమంలో ఇలా ప్రపంచకప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్టార్ బౌలర్ బుమ్రా విషయంలో మాత్రం బీసీఐ సీ ఒక తప్పు చేసి.. చివరికి అతని అవమానించింది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. కాగా ఇటీవల వాంకడే  స్టేడియంలో జరిగిన ఈవెంట్లో టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా డాన్స్ లతో రెచ్చిపోయారు. అదే సమయంలో బిసిసిఐ ప్రకటించిన 125 కోట్ల నజరానాను కూడా జట్టు సభ్యులకు అందజేశారు.


 ఈ కార్యక్రమంలో బిసిసిఐ ఒక వీడియోని కూడా ప్రచారం చేసింది. ఆ వీడియోలో రోహిత్ శర్మ కెప్టెన్సీ లో టీమిండియా కప్పు కొడుతుందని జై షా అన్న మాటలతో పాటుగా టీమిండియా ఆటగాళ్లకు సంబంధించిన స్పెషల్ వీడియోలు కూడా ఉంటాయి. ఇందులో టీమిండియాలోని అందరు ప్లేయర్లు కూడా కనిపించారు  కానీ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా మాత్రం వీడియోలో ఎక్కడ కనిపించలేదు. దీంతో అక్కడున్న వారందరూ ఇది చూసి ఆశ్చర్యపోయారు. వరల్డ్ కప్ లో అద్భుతంగా రానించి జట్టును విజయతీరాలకు నడిపించిన బుమ్రాను ఇలా అవమానించడమేంటి అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: