ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి క్రేజ్ ఉంది కాబట్టి ఇక క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయం తెరమీదకి వచ్చినా కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే చాలా మటుకు పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకోవడానికి క్రికెటర్లు పెద్దగా ఇష్టపడదు. కానీ కొన్ని కొన్ని సార్లు ఏకంగా ఇక మనకు అందరికీ తెలిసిన క్రికెటర్ల గురించి తెలియని విషయాలను ఇక ఆయా స్టార్ క్రికెటర్ల సహచరులు ఇంటర్వ్యూలలో బయట పెట్టడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


ఈ క్రమంలోనే టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా ప్రస్తుతం భారత జట్టులో స్టార్ ప్లేయర్లుగా సీనియర్లుగా కొనసాగుతున్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే అమిత్ మిశ్రా  చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయాయ్.ముఖ్యంగా అటు విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ ఫేమ్ వచ్చిన తర్వాత అతనిలో ఎంతగానో మార్పు వచ్చింది అంటూ ఇక ఈ మాజీ ప్లేయర్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి.


 ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు భారత మాజీ ప్లేయర్ అమిత్ మిశ్రా. తను ఫస్ట్ టైం కలిసినప్పుడు రోహిత్ శర్మ ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు ఈ మాజీ ప్లేయర్. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఫేమ్, కెప్టెన్సీ వచ్చిన తర్వాత ఎంతగానో మారిపోయాడు అంటూ తెలిపాడు. అందుకే అతనికి టీంలో ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నారు అంటూ తెలిపాడు. ఇక ఇప్పుడు మా మధ్య అసలు మాటలు కూడా లేవు అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ మాత్రం ఎక్కడ కలిసిన ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడతాడని.. జోక్స్ వేసుకుంటూ ఉంటాడు అంటూ అమిత్ మిశ్రా చేసిన కామెంట్స్ వైరల్ గా  మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: