టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ జట్టులో ఎంత కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా తన ఆట తీరుతో ప్రత్యర్ధులను భయపెడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఒక్కసారి రోహిత్ శర్మ క్రీజులో కుదురుకున్నాడు అంటే ఇక బౌలర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. వరల్డ్ లోనే అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకడిగా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. ఇక అలవోకగా డబుల్ సెంచరీలు చేయడంలో దిట్ట. అందుకే రోహిత్ ను అభిమానులు అందరూ కూడా డబుల్ సెంచరీల వీరుడు అని పిలుస్తూ ఉంటారు.


 అయితే ప్రస్తుతం రోహిత్ శర్మ కెరియర్ చివరి దశలో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల టి20 ఫార్మాట్లో ఇక టీమిండియాకు వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఏకంగా పొట్టి ఫార్మాట్ కు తాను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. దీంతో ప్రస్తుతం కేవలం వన్డేలు టెస్ట్ ఫార్మాట్ లలో మాత్రమే కొనసాగుతూ ఉన్నాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే ఈ రెండు ఫార్మాట్లలో కూడా ఐసీసీ ట్రోఫీలు అందించాలని పట్టుదలతో ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే మరికొన్ని రోజులు శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్లో ఇక కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించబోతున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది.



 శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేస్తే చూడాలని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ వన్డేల్లో ద్విశతకం బాది దాదాపు 7 ఏళ్ళు అవుతుంది. చివరిసారిగా 2017 లో ఆయన డబుల్ సెంచరీ సాధించాడు. అయితే వచ్చే నెల రెండు నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది  ఈ క్రమంలోనే తనకు అచ్చొచ్చిన లంకపై మరో డబుల్ సెంచరీ సాధించాలని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే రోహిత్ శర్మ కెరియర్ మొత్తంలో శ్రీలంక పైన రెండు డబుల్ సెంచరీలు బాధటం గమనార్హం. ఇక ఓవరాల్ గా చూసుకుంటే మూడుసార్లు ద్విశతకాన్ని బాది తిరుగులేని ప్లేయర్గా ఎదిగాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: