ప్రస్తుతం పాకిస్తాన్, ఇండియా మధ్య క్రికెట్ సంబంధాల పై నిషేధం కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఒక దేశ పర్యటనకు మరో దేశం వెళ్లడం అస్సలు జరగదు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న కీలకమైన టోర్నీలకు అటు బీసీసీఐ వెళ్లే ప్రసక్తే లేదు అంటూ మొండికేసి కూర్చుంది. గతంలో ఆసియా కప్ సమయంలో కూడా ఇలా తాము పాకిస్తాన్ పర్యటనకు వెళ్లము అంటూ చెప్పడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎన్నో రోజులపాటు చర్చలు జరిపి భారత జట్టు ఆడే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించారు. అయితే 2025 ఏడాదిలో అటు పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది.


 ఈ క్రమంలోనే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ కు వెళ్తుందా లేదా అనే విషయంపై అందరిలో అనుమానాలు నెలకొనగా.. తాము పాకిస్తాన్ పర్యటనకు వెళ్లే ప్రసక్తే లేదని కావాలంటే టోర్ని నుంచి తప్పుకుంటామని.. ఒకవేళ తాము టోర్నీలో పాల్గొనాలి అనుకుంటే మాత్రం తటస్థ వేదికను ఏర్పాటు చేయాలి అంటూ స్పష్టంగా చెప్పేసింది బీసీసీఐ. అయితే గత కొంతకాలం నుంచి ఇదే విషయంపై చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం భారత జట్టు తమ దేశానికి వచ్చి తీరాల్సిందే అంటూ మొండిపట్టు పడుతూ ఉంటే.. అటు బీసీసీఐ మాత్రం తాము ఆడబోయే మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్ లో తటస్థ వేదికపై నిర్వహించాలని పట్టుబట్టింది.


 అయితే వరల్డ్ లోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కొనసాగుతున్న బీసీసీఐ మొండిగా కూర్చోవడంతో.. చివరికి ఐసీసీ దిగిరాక తప్పలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు భారత్కు అనుగుణంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పాకిస్థాన్లో పూర్తి ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పటికీ కేవలం భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రం తటస్థ వేదికలో నిర్వహించేందుకు ఐసిసి బడ్జెట్ ను కేటాయించిందని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంకోన్నాళ్లలో బీసీసీఐ ఫైనల్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తుందట ఐసీసీ. ఇది తెలిసిన టీమ్ ఇండియా ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. బీసీసీఐతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: