క్రికెట్‌లో ప్రతినెలా అద్భుతంగా ఆడిన క్రికెటర్లకు ICC సంస్థ " ప్లేయర్ ఆఫ్ ది మంత్" అవార్డు ఇస్తుంది. 2024, జులై నెలలో ఈ అవార్డుని ఇద్దరు క్రికెటర్లు గుస్ ఆట్‌కిన్సన్ (ఇంగ్లాండ్), చమరి అథపత్తు (శ్రీలంక) గెలుచుకున్నారు. ఐసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముగ్గురు ఇండియన్ ప్లేయర్లకు షాక్ తగిలినట్లు అయింది ఎందుకంటే వాళ్ళు నామినేషన్ లో ఉన్నారు. ఈసారి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంటామేమో అని ఆశపడ్డారు కానీ ఐసీసీ వారందరి హార్ట్స్ బ్రేక్ చేసింది. ఆ ముగ్గురు ఇండియన్స్ మరెవరో కాదు వాషింగ్టన్ సుందర్, షెఫాలీ వర్మ, స్మృతి మంధాన. వీళ్లు ఆయా జెండర్స్ లో నామినేట్ అయ్యారు. వీరితో పాటు స్కాట్లాండ్‌ క్రికెటర్ చార్లీ క్యాజిల్ కి కూడా నిరాశ ఎదురయ్యింది

గుస్ ఆట్‌కిన్సన్ తొలిసారిగా టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఆటలో తన అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ జట్టుపై గెలవడానికి కీలక పాత్ర పోషించాడు. చమరి అథపత్తు శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్. ఆమె నాయకత్వంలో శ్రీలంక జట్టు మహిళల ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఇది చాలా పెద్ద విజయం ఎందుకంటే ఈ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ శ్రీలంక జట్టు భారత్ జట్టును ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇంగ్లాండ్ ప్లేయర్ గుస్ ఆట్‌కిన్సన్ జట్టు తరపున తొలిసారిగా టెస్ట్ క్రికెట్ ఆడాడు. తన మొదటి ఆటలోనే అతను చాలా బాగా ఆడాడు. ఇంగ్లాండ్, వెస్టిండీస్ రెండు దేశాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు మూడు మ్యాచ్‌లు గెలిచింది. ఈ మూడు మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ జట్టు గెలవడానికి గుస్ ఆట్‌కిన్సన్ చాలా కీలక పాత్ర పోషించాడు. అతను మొత్తం 22 మంది బ్యాట్స్‌మెన్‌లను బౌల్డ్‌ అవుట్ చేశాడు. ఇది చాలా గొప్ప విజయం.

"ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలవడం నాకు చాలా గర్వకారకం! నా టెస్ట్ కెరీర్ అద్భుతంగా ప్రారంభమైంది. ఇంగ్లాండ్ జట్టుతో నా మొదటి సిరీస్‌లోనే ఇంతటి విజయం సాధిస్తానని నేను ఊహించలేదు," అని ఆట్‌కిన్సన్ ఐసీసీకు చెప్పాడు. "బాజ్ (బ్రెండన్ మెక్‌కలమ్), స్టోక్సీ (బెన్ స్టోక్స్) చాలా ఫ్రెండ్లీ వాతావరణం సృష్టించారు. వారికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నాను." అని అన్నాడు.

చమరి అథపత్తు శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు ఆసియా కప్ ట్రోఫీని గెలవడంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఈ టోర్నమెంట్‌లో ఆమె మొత్తం 304 పరుగులు చేసింది.  ఈ టోర్నమెంట్‌లో మలేషియా జట్టుతో ఆడిన మ్యాచ్‌లో ఆమె 119 పరుగులు (నాటౌట్‌), ఇంకో రెండు మ్యాచ్‌లలో 50 పరుగులకు పైగా చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా 166 పరుగులు చేసింది. చమరి అథపత్తు, హర్షిత సమరవిక్రమ కలిసి 61 పరుగులు చేసి జట్టును గెలిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: