2024 పారిస్ ఒలింపిక్స్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, వినేష్ ఫోగట్‌కి ఘన స్వాగతం లభించింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఆమెను ఒక యోధురాలు లాగా ట్రీట్ చేశారు. ఆమెపై పూల వర్షం కురిపించారు గోల్డ్ మెడల్ గెలవకపోయినా చాలా ప్రేమ చూపించారు. విమానాశ్రయం నుండి బయటకు వచ్చినప్పుడు వందలాది మంది అభిమానులు ఆమె చుట్టూ చేరారు. అభిమానుల ప్రేమకు వినేష్ భావోద్వేగానికి గురయ్యారు. సాక్షి మాలిక్‌, బజరంగ్ పునియా కూడా విమానాశ్రయంలో ఆమెకు వెల్కమ్ చెప్పారు.

ఇది ఇలా ఉండగా రాఖీ పండుగ సందర్భంగా, వినేష్‌కు మరో అనుభూతి లభించింది. ఆమె రాఖీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. తన తమ్ముడితో కలిసి ఈ పండుగను జరుపుకుంటున్న వినేష్ ఈ వీడియోలో కనిపిస్తోంది. వినేష్ ఫోగట్, ఆమె కుటుంబం నివసిస్తున్న బబ్లీ అనే ప్రదేశంలో ఈ వీడియో షూట్ చేశారు. ఈ క్లిప్‌లో వినేష్ తన తమ్ముడితో కలిసి రాఖీ పండుగను జరుపుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. తన తమ్ముడిని ఆటపట్టించేటప్పుడు వినేష్ చాలా సంతోషంగా కనిపించింది.

వినేష్ వీడియోలో మాట్లాడుతూ "నాకు దాదాపు 30 ఏళ్లు. గత ఏడాది నాకు 500 రూపాయలు ఇచ్చాడు. ఆ తర్వాత ఇది ఒక నోట్ల కట్ట తన జీవితమంతా కష్టపడి ఇంత డబ్బు సంపాదించాడు (జోక్‌గా), అది నాకు ఇచ్చాడు." అని తెలిపింది. తన అక్క మాటలకు వినేష్ తమ్ముడు నవ్వుతూనే ఉన్నాడు. ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు. కష్టమైన, బాధాకరమైన ఒలింపిక్స్ తర్వాత, వినేష్ తన కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. https://x.com/ians_india/status/1825438914150043781?t=BvyL7fpqNOn3FEqa_SB1pA&s=19 ఈ లింకు పై క్లిక్ చేసి వీరి సెలబ్రేషన్స్ వీడియో చూడవచ్చు

పారిస్ ఒలింపిక్స్‌లో ఆశించిన ఫలితం రాకపోవడంతో, వినేష్ ఫోగట్ కుస్తీ నుండి రాజీనామా చేసింది. తన ఇంటికి చేరుకున్న తర్వాత, తిరిగి కుస్తీలోకి రావచ్చని, కానీ అవకాశం చాలా తక్కువ అని ఆమె చెప్పింది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల పతకం గెలుచుకున్న వినేష్, తన గ్రామం నుంచి ఎవరైనా ప్రపంచ వేదికపై భారత దేశ జెండాను సగర్వంగా రెపరెపలాడించాలని కోరుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: