టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఏది ఉన్నా ముక్కుసూటిగా మాట్లాడే గౌతం గంభీర్ తన ఆట తీరుతో మాత్రమే కాదు వివాదాల ద్వారా కూడాఎంతో పాపులారిటీ సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు భారత జట్టులో డేర్ అండ్ డాష్ ఓపెనర్ గా కొనసాగిన గంభీర్.. ఇక ధోని కెప్టెన్సీలో భారత జట్టు రెండు వరల్డ్ కప్ లు గెలవడంలో కూడా కీలక పాత్ర వహించాడు అనిచెప్పాలి. అయితే ఎప్పుడు తనకు రావాల్సిన గుర్తింపును రాలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా కెప్టెన్ ధోనిని ఉద్దేశిస్తూ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉండడం చూస్తూ ఉంటాం.


 అయితే కేవలం ఇలా సోషల్ మీడియాలో మాత్రమే కాదు ఐపీఎల్లో కూడా ఎంతో మంది ఆటగాళ్లతో గొడవలు పెట్టుకుని వార్తలలో నిలిచాడు గౌతమ్ గంభీర్. కాగా కొంతకాలం నుంచి కొత్త అవతారం ఎత్తాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా టీమిండియా హెడ్ కోచ్ పదవీ బాధ్యతలను చేపట్టాడు గౌతమ్ గంభీర్. ఈ క్రమంలోనే గంభీర్ తన నేతృత్వంలో భారత జట్టును ఎలా ముందుకు నడిపించబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇకపోతే ఈ మధ్యకాలంలో భారత ఆటగాళ్లు అందరూ కూడా తమ ఆల్ టైం ఫేవరెట్ జట్టును ప్రకటించడం ఒక ట్రెండ్ గా మారింది. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇలా అతను ఫేవరెట్ వన్డే జట్టును ప్రకటించాడు.



 దీంతో గంభీర్ ప్రకటించిన జట్టును చూసి ప్రస్తుతం టీమిండియా ఫ్యాన్స్ అందరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మకు తన ఆల్ టైం ఫేవరెట్ వన్డే జట్టులో చోటు కల్పించలేదు గంభీర్. ఇక తన జట్టుకి ధోనిని సారథిగా ఎంచుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ధోని, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్లకి తన ఆల్ టైం ఫేవరెట్ వన్డే జట్టులో చోటు కల్పించాడు. అయితే ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా, స్టార్ బ్యాటర్ గా కొనసాగుతున్న రోహిత్ ను మాత్రం పక్కన పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: