వరల్డ్ క్రికెట్లో చిన్న టీం గా కొనసాగుతున్న బంగ్లాదేశ్ జట్టు ఇటీవల అసమాన్యమైన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్ పర్యటనలో ఉంది. ఇక ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య పాకిస్తాన్ తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి మ్యాచ్ లో ఏకంగా పాకిస్తాన్ వారి సొంత గడ్డ మీదే 10 వికెట్ల తేడాతో ఓడించి ఘనవిజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్ జట్టు ఇక రెండో టెస్ట్ మ్యాచ్ లోను అదరగొట్టేసింది.


 వరుసగా రెండు టెస్ట్ మ్యాచ్ లో కూడా విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ జట్టుకు టెస్ట్ ఫార్మాట్లో ఒక దేశ పర్యటనకు వెళ్లి టెస్టు సిరీస్ ను క్లీన్స్వీప్ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే ఇలా పాకిస్తాన్యూ చిత్తుగా ఓడించాము అనే జోష్లో ఏకంగా భారత జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు బంగ్లాదేశ్ కెప్టెన్ షంటో. భారత్తో జరిగే సిరీస్ లోను తాము ఇలాగే ఆడుతాము అంటూ తెలిపారు.


 పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ సిరీస్లో రాణించిన ఆటగాళ్లు టీమ్ ఇండియాతో సిరీస్ లోను రాణిస్తే ఇక భారత జట్టుకు ఓటమి తప్పదు అంటూ వ్యాఖ్యానించాడు. భారత్తో జరగబోయే తదుపరి సిరీస్ తమకు ఎంతో కీలకము అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ పై గెలుపు మాలో నమ్మకాన్ని మరింత పెంచింది. ఈ సిరీస్ లో పర్ఫార్మ్ చేసిన ఆటగాళ్లు అటు భారత్ మీద కూడా ఇరగ దీస్తారని ఆశిస్తున్న.. మేము భారత్తో సిరీస్ కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం అంటూ బంగ్లాదేశ్ కెప్టెన్ షంటో కామెంట్ చేశాడు. ఈ క్రమంలోనే అతను చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఇది చూసిన నేటిజన్స్ ఒక్క సిరీస్ విజయానికి ఇంత బిల్డప్ అవసరమా.. టీమిండియా ఏమైనా పాకిస్తాన్ అనుకున్నావా..పెట్టుకుంటే మామూలుగా ఉండదు అంటూ సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ కెప్టెన్ కామెంట్స్ ని ట్రోలింగ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: