ఇండియాలో క్రికెట్కు ఉన్న పాపులారిటీ అంతా కాదు. ప్రపంచం మొత్తం ఫుట్బాల్ ఆటను చూసేందుకు ఇష్టపడుతూ ఉంటే అటు ఇండియా మాత్రం ఫుట్బాల్ ని అస్సలు పట్టించుకోదు. క్రికెట్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు ఇక్కడ క్రీడాభిమానులు. ఎన్ని పనులున్నా  పక్కన పెట్టేసి క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. క్రికెట్ కి ఈ రేంజ్ లో పాపులారిటీ ఉంది. కాబట్టి ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ప్రతి ప్లేయర్ కూడా ఒక్కసారిగా లైఫ్ లగ్జరీగా మారిపోతూ ఉంటుంది.


 ఒకవైపు బీసీసీఐ ఇచ్చే వేతనంతో పాటు ఇంకోవైపు ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయం మరోవైపు వాణిజ్య ప్రకటనల ద్వారా ఇలా రెండు చేతులారా సంపాదిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇండియాలో క్రికెటర్ ఎవరు అంటే ముందుగా విరాట్ కోహ్లీ పేరే అందరికీ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకోవడం విషయంలో వాణిజ్య ప్రకటనలు చేయడం విషయంలో మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే టాప్ లో ఉన్నాడు. ప్రతి ఏడాది ఏకంగా వందల కోట్ల రూపాయల సంపాదిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇలా ఇండియాలో రిచెస్ట్ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ వరల్డ్ క్రికెట్లో మాత్రం క్రీడా ప్రపంచంలో రిచెస్ట్ క్రికెటర్ల జాబితాలో ఏ స్థానంలో ఉన్నాడో అని తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎప్పుడు ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు.


 కాగా గడిచిన ఏడాదికాలంలో ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారుల జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 9వ స్థానంలో నిలిచాడు. స్టార్టీష్ట  నివేదిక ప్రకారం.. కోహ్లీ 847 కోట్లు అర్జించాడు. క్రిస్టియానో రోనాల్డో 2081 కోట్లు అర్జించి  ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో స్పానిష్ గోల్ఫ్ ప్లేయర్ జోన్ రహ్ము 1712 కోట్లతో రెండవ స్థానంలో ఉండగా.. ఒక వెయ్యి 74 కోట్లతోమెస్సి ఈ లిస్టులో మూడో స్థానంలో మెస్సి ఉండడం గమనార్హం. అయితే కోహ్లీ ఏకంగా 847 కోట్లు ఒక్క ఏడాదిలోనే అర్జించాడు అన్న విషయం తెలిసి అభిమానులషాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: