యశస్వి జైస్వాల్ భారత క్రికెట్ జట్టులో యంగ్ ప్లేయర్, ఓపెనింగ్ బ్యాటర్. టీమిండియా తరఫున ఐపీఎల్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ తో తన క్రికెట్ కెరీర్ కొనసాగిస్తూ స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. నిరంతరం ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ తో పరుగులు చేస్తున్నాడు. అయితే జైస్వాల్ చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఉత్తర ప్రదేశ్ లోని మారుమూల ప్రాంతంలో పుట్టిన జైస్వాల్ క్రికెటర్ కావాలని చిన్ననాటి నుంచి కలలు కన్నాడు. ఆరుగురు పిల్లలు ఉన్న కుటుంబంలో నాలుగవ సంతానం యశస్వి.


దేశ ఆర్థిక రాజధాని ముంబైకి చేరుకుంటే తన కోరిక, కళ సహకారం చేసుకోవచ్చని అనుకున్నాడు. అయితే ఇంత పెద్ద మహానగరంలో తనకు తెలిసిన వారి ఇంట్లో ఉండడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. తోలుత ఒక చిన్న షాప్ లో పనిచేశాడు. అనంతరం గ్రౌండ్ లోను తలదాచుకున్నాడు. క్రికెట్ లో ప్రవేశం కోసం కొంత కాలం పాటు పానీపూరిని అమ్మాడు. అలా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ కోచ్ జ్వాలా సింగ్ కంటపడ్డాడు.


అనంతరం స్థానిక క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటూనే తన పోరాటాన్ని కొనసాగించాడు. అయితే ప్రస్తుతం టీమ్ ఇండియాలో కొనసాగుతున్న జైస్వాల్ ఓ కత్తిలాంటి అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నారట. ఆ అమ్మాయితో యశస్వి జైస్వాల్ రిలేషన్ లో ఉన్నారట. వీరికి సంబంధించి అనేక రకాల పుకార్లు జరుగుతున్నప్పటికీ ఈ వార్తలపై జైస్వాల్ ఇంకా స్పందించలేదు. గత మూడేళ్ల నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని పలు మీడియా కథనాల సమాచారం. మ్యాడీ హామిల్టన్ బ్రిటన్ నివాసి. విద్యాభ్యాసం కొనసాగిస్తోంది.

అయితే కొన్ని సందర్భాల్లో ఇండియా మ్యాచుల సమయంలో స్టాండ్స్ నుంచి జైస్వాల్ ని ఎంకరేజ్ చేస్తూ చాలాసార్లు ఆమె కనిపించింది. జనవరిలో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచులో స్టాండ్స్ లోను కనిపించారు. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని, ప్రేమాయణం కొనసాగిస్తున్నారంటూ అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: