సాధారణంగా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఇరు జట్లు ఆ మ్యాచ్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం చూస్తూ ఉంటాం. తప్పనిసరిగా ఆ మ్యాచ్ లో విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటాయి. అయితే ఒకవేళ ఒక మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత మ్యాచ్లో అయినా బాగా రానించాలని సిరీస్ లో పైచేయి సాధించాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఉంటే అందులో తప్పక విజయం సాధించాలని పట్టుదల ఇరు జట్లకు ఉంటుంది.


 అయితే ఇటీవల ఇలాంటి పట్టుదలతోనే ఉన్న న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ జట్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. గ్రేటర్ నోయిడా వేదికగా ఇరుజట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు చివరికి వర్షార్పణం అయిపోయింది. చివరి రోజు కూడా వర్షం పడటంతో ఎంపైర్లు శుక్రవారం మ్యాచ్ నూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది అని చెప్పాలి. అయితే మ్యాచ్ జరిగేలా చేయడానికి గ్రౌండ్ సిబ్బంది ఎంతలా శ్రమించిన మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో తొలిరోజు ఆట సాధ్యపడలేదు.


 డ్రైనేజీ వ్యవస్థ, మైదానాన్ని సిద్ధం చేసే పరికరాలు అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశం గా మారింది. రెండో రోజు నుంచి వర్షం కురవడం తో ఆట రద్దు అవుతూ వచ్చింది. చివరి రోజు శుక్రవారం కూడా వరుణుడు కరుణించక పోవడంతో చివరికి చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. దీంతో గ్రేటర్ నోయిడా చెత్త రికార్డును మూట పెట్టుకుంది. 1933 నుంచి భారత్ సుదీర్ఘ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తుంది. 91 ఏళ్లలో కనీసం ఒక్క బంతి కూడా పడకుండా ఓ టెస్ట్ మ్యాచ్ రద్దు అవడం భారత్ లో ఇదే తొలిసారి. ఆసియాలో ఇది రెండో సారి. 1998లో పాక్ వేదికగా పాక్ - జింబాబ్వే మధ్య జరిగిన మూడో టెస్ట్ బంతి పడకుండానే తుడిచి పెట్టుకు పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: