టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ... గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2023 ప్రపంచ కప్ టోర్నమెంట్లో అద్భుతంగా రానించి టీమిండియాను ఫైనల్ దాకా తీసుకువెళ్లాడు మహమ్మద్ షమీ. అయితే 2023 వన్డే ప్రపంచ కప్ సమయంలో.. తీవ్ర గాయంతో టీమిండియా జట్టు నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకొని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు టీ మిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ.

 

టీమిండియా మేనేజ్మెంట్ సెలెక్ట్ చేస్తే... మళ్లీ జట్టు లోకి రానున్నాడు. వచ్చే రంజీ ట్రోఫీలో కూడా ఆడేందుకు రెడీ అవుతున్నాడట.  అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ కి  ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎయిర్పోర్టు లో... టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ చిక్కుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదిక గా మహమ్మద్ షమీ.. పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

 

ఎయిర్ పోర్ట్ లో... చిక్కుకున్నట్లు ఫోటోలను కూడా.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ  పంచుకోవడం జరిగింది. కొన్ని టెక్నికల్ కారణాలవల్ల.. అభిమానం ఆలస్యమైందని ఈ సందర్భం గా మహమ్మద్ షమీ వెల్లడించారు. దీంతో ఎయిర్పోర్ట్  నాకు ఇల్లుగా మారిందని కూడా... పరోక్షంగా నిరసన తెలిపాడు మహమ్మద్ షమీ.

 

అయితే మహమ్మద్ షమీ చేసిన పోస్ట్ పై... స్పందిస్తున్నారు అతని ఫ్యాన్స్. ఎయిర్పోర్టు అధికారుల పై  విమర్శలు చేస్తూ... మహమ్మద్ షమీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అటు సోను సూద్ కూడా దీనిపైన స్పందించాడు. మహమ్మద్ షమీ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని కోరారు. ఎయిర్పోర్ట్ లో కూడా షమీ ఇంట్లో పడుకున్నట్లు గానే పడుకున్నాడని... పేర్కొన్నారు సోను. ఇక దీనికి షమీ కూడా రిప్లై ఇచ్చాడు. భయంకరంగా నవ్వుతూ... షమి రిప్లై ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: