టీమిండియా డేర్ అండ్ డాషింగ్ మాజీ ఓపెనర్, ప్రస్తుతం భారత జట్టు హైట్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లపాటు భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో సేవలు అందించిన గౌతమ్ గంభీర్.. తన ఆట తీరుతో ఎంతో మధు అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. టీమిండియా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో రెండు వరల్డ్ కప్ లు గెలిచింది అన్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈ రెండు వరల్డ్ లను గెలవడంలో గౌతమ్ గంభీర్ ఎంతో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.


 ఇక ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లో ఆడే వార్తల్లో నిలిచిన గౌతం గంభీర్ కేవలం క్రికెట్తో మాత్రమే కాకుండా వివాదాలతోనూ ఇక ఇలా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఏది ఉన్న ముక్కుసూటిగా మాట్లాడే గంభీర్.. ఇప్పటివరకు ఎంతమంది క్రికెటర్లతో మైదానంలో గొడవ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఐపీఎల్ లో ఏకంగా తన సహచరులతో గొడవ పడిన గంభీర్ అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో మంది విదేశీ ప్లేయర్లతో కూడా తరచు గొడవ పడుతూ ఉండేవాడు అని చెప్పాలి. అయితే అలాంటి గౌతమ్ గంభిర్ ఓసారి ట్రక్కు డ్రైవర్ తో కూడా గొడవపడ్డాడట.


 ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న గౌతమ్ గంభీర్ కేవలం మైదానంలో మాత్రమే కాకుండా ఎక్కడైనా గొడవకు ఎప్పుడు రెడీ గానే ఉంటాడు అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. గంభీర్ చాలా త్వరగా సహనాన్ని కోల్పోతాడు. ఢిల్లీలో ఓసారి ఓ ట్రక్కు డ్రైవర్ రాంగ్ రూట్లో వచ్చాడు. పైగా గంభీర్ పైనే నోరు పారేసుకున్నాడు. దీంతో గంభీర్ కోపంతో ఊగిపోయాడు. ఏకంగా ట్రక్కు డ్రైవర్ దగ్గరికి వెళ్లి కాలర్ పట్టుకుని మాట్లాడాడు. తేడా వస్తే గంభీర్ తో అలాగే ఉంటుంది అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: