టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గురించి అటు భారత క్రికెట్ ప్రేక్షకులకే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ కి కూడా కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో అందరికి సుపరిచితుడుగా మారిపోయాడు ఈ స్టార్ క్రికెటర్. ఏకంగా ఈ తరానికి తనను మించిన లెజెండరీ క్రికెటర్ మరొకరు లేరు అన్న విషయాన్ని ఇప్పటికే నిరూపించేశాడు అన్న విషయం తెలిసిందే. ఇక వరల్డ్ క్రికెట్ ప్రేక్షకులందరికీ చేత రికార్డుల రారాజు అని పిలిపించుకుంటున్నాడు ఈ ప్లేయర్.



 ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఇంకా కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాడిలాగానే క్రికెట్ పట్ల నిబద్ధతను చూపిస్తూ ఉంటాడు. ఇలాంటి డెడికేషన్ ఉంది కాబట్టే విరాట్ కోహ్లీ వరల్డ్ లోనే బెస్ట్ క్రికెటర్ గా ఎదగ గలిగాడు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే తొలి టెస్ట్ మ్యాచ్లో భాగంగా విరాట్ కోహ్లీ అదరగొడతాడు అనుకుంటే తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయాడు. మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 6 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో 17 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు.


 దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో కోహ్లీ మరోసారి క్రికెట్ పట్ల తన డెడికేషన్ చాటుకున్నాడు. ఒకవైపు మ్యాచ్ జరుగుతున్న చెన్నైలోని స్టేడియంలో.. ఇంకోవైపు  నెట్స్ లో విరాట్ కోహ్లీ చెమటోడుస్తూ కనిపించారు. సహాయక సిబ్బంది సాయంతో కఠోర సాధన చేశాడు. అయితే కోహ్లీ ఇలా చేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ప్రాక్టీస్ చేశాడు. అయితే ఇది చూసి కోహ్లీ డెడికేషన్ ఎప్పుడు మారదు ఆటపట్ల ఆయనకు ఉన్న అంకితభావం ఆయనను ఈ స్థాయికి తీసుకువచ్చింది అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: