అవును, మీరు విన్నది నిజమే. ఇపుడు భారత్‌ వేదికగా టీమ్‌ఇండియాతో తలపడమంటే ప్రత్యర్థి ఆటగాళ్లు తడబడిన పరిస్థితి. గతంలో స్పిన్‌తో ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టించిన భారత్‌.. ఇప్పుడు పేస్‌ అస్త్రాన్ని ప్రయోగించి ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా టీమ్‌ఇండియా మరోసారి స్వదేశంలో తిరుగులేదని నిరూపించింది. టీమ్‌ఇండియా గత 12 ఏళ్లుగా ఒకట్రెండు టెస్టు మ్యాచుల్లో తప్పితే సిరీస్‌ ఓటమే లేకుండా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

పాకిస్థాన్‌ను విజయవంతంగా ఓడించి ఫుల్ జోష్‌ మీదున్న బంగ్లాదేశ్‌ను 2 టెస్టుల సిరీస్‌లో భారత్ చిత్తుచిత్తు కింద ఓడించింది. బంగ్లాదేశ్‌తో మొదట చెన్నై మైదానంలో జరిగిన మ్యాచ్‌లో భారీ తేడాతో భారత్‌ గెలిచింది. ఇక వర్షం కారణంగా అనేక సందేహాల మధ్య సాగిన రెండో టెస్టులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత్ విజయం సాధించింది. దాంతో టెస్టుల్లో ఓటముల కంటే విజయాలే ఎక్కువగా సాధించిన జట్టుగానూ టీమిండియా మారింది. గత 12 ఏళ్లుగా భారత్ ఒక్క సిరీస్‌ను కోల్పోలేదు.  బంగ్లాదేశ్‌ 177 రోజులతో 8వ స్థానంలో ఉండగా.. దాయాది దేశం పాక్ కేవలం 24 రోజులను మాత్రమే తన పేరిట ఈ రికార్డును ఉంచుకుని ఆఖరి ప్లేస్‌కు పరిమితమైంది.

ఇకపోతే, ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని టీమ్‌ఇండియా 2012/13 సీజన్‌లో ఇంగ్లండ్‌తో 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోవడం జరిగింది. ఇక ఆ తరువాత నుంచి తాజాగా బంగ్లాతో సిరీస్‌ వరకూ 18 టెస్టు సిరీస్‌లను వరుసగా గెలుచుకు రావడం విశేషమనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు స్వదేశంలో జరిగిన ఏ ఒక్క సిరీస్‌ను టీమిండియా వదలలేదు. దాదాపు 4,300కి పై రోజుల నుంచి టీమిండియా ఇక్కడ గెలుస్తూనే ఉంది.  సఫారీ జట్టు దాదాపు 1,704 రోజులపాటు స్వదేశంలో సిరీస్‌ ఓటమే లేకుండా సాగిపోయింది. చివరిసారిగా 2019/2020లో ఆ జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-1 తేడాతో కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: