ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఒక జట్టు మరో దేశ పర్యటనకు వెళ్లడం అస్సలు జరగదు. కేవలం ఐసీసీ ట్రోఫీలు జరిగినప్పుడు మాత్రమే.. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరగడం చూస్తూ ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో ఇలా ఐసీసీ టోర్నీలలో మ్యాచ్ల విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు వరుసగా షాకులు తగులుతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఎందుకంటే గత కొంతకాలం నుంచి వరుసగా ఐసీసీ ట్రోఫీలు అన్నీ కూడా అటు పాకిస్తాన్ వేదికగా జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో తమ ఆటగాళ్ల భద్రతను ప్రమాదంలో పెట్టలేము అంటూ అటు బిసిసిఐ తేల్చి చెప్పింది. ఇక తటస్థ వేదికపై మ్యాచ్ లు నిర్వహిస్తేనే తాము ఆయా టోర్నీలలో పాల్గొంటాము అంటూ తెగేసి చెబుతుంది. అయితే 2025 ఏడాదిలో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్ని విషయంలో కూడా బీసీసీఐ అదే వైఖరితో వ్యవహరిస్తుంది.


 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాము పాకిస్తాన్ వెళ్లలేమని.. తటస్థ వేదికపై మ్యాచ్లు నిర్వహిస్తేనే పాల్గొంటాము అంటూ ఇప్పటికే తెగేసి చెప్పేసింది. అయితే టీమిండియా కోసం అటు తటస్థ వేదికపై మ్యాచ్ లు నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా నిర్ణయించింది. కానీ ఫైనల్ మ్యాచ్ ను అటు పాకిస్తాన్లోని లాహోర్ వేదికగా నిర్వహించేందుకు ఇప్పటికే వేదికను కూడా సిద్ధం చేసింది. కానీ ఇక భారత జట్టు ఫైనల్ కు వెళితే దుబాయ్ కి వేదికగా ఫైనల్ నిర్వహించాలని ఐసిసి యోచిస్తున్నట్లు తెలుస్తుంది. లేదంటే లాహోర్ లోనే నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ విషయంలో కూడా అటు బీసీసీఐ పట్టు నిలుపుకుందని.. ఇక దీంతో అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి బిగ్ షాక్ తగిలింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: