సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ గురించి వినే ఉంటారు. ఆమె కళానిధి మారన్ వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు. కావ్య తల్లి కావేరీ మారన్ ప్రస్తుతం సోలార్ టీవీ కమ్యూనిటీ రిస్ట్రిక్టెడ్‌కు సీఈవోగా వ్యవహరిస్తోంది. భారతదేశంలో అత్యధిక వేతనం అందుకునే మహిళా ముఖ్య కార్య నిర్వాహక అధికారుల్లో ఆమె కూడా ఒకరు కావడం విశేషం. కాగా కావ్య 2018 నుంచి సన్‌రైజర్స్ సీఈవోగా వ్యవహరిస్తోంది. సన్ ‌నెట్‌వర్క్, సన్ మ్యూజిక్, ఎఫ్‌ఎం ఛానల్స్‌ బాధ్యతలను కూడా ఆమె చూసుకుంటోంది.

విషయంలోకి వెళితే... ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ గా కొనసాగుతున్న ఆమె, నార్తర్న్ సూపర్‌చార్జర్స్ మొత్తం వాటాను కొనుగోలు చేసేందుకు తాజాగా బిడ్‌ను వేసి గెలుచుకుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, చెన్నైకి చెందిన మీడియా కాంగ్లోమరేట్ ఫ్రాంచైజీలో 100% వాటా కోసం వర్చువల్ వేలంలో £100 మిలియన్లకు పైగా చెల్లించినట్టు భోగట్టా. ఈ డీల్ సొంతం చేసుకునేందుకు ఉన్న మరో 2 పార్టీలు కూడా బాగానే ట్రై చేసినా సన్ గ్రూప్ చివరికి వాటిని అధిగమించి చేజిక్కిచ్చుకుంది.

దాంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL )లో 100 బాల్ టోర్నమెంట్‌లో ఫ్రాంచైజీ ఉన్న 3వ అతిపెద్ద ఫ్రాంచైజీగా ఆమె నిలిచారు. గతంలో ముంబై ఇండియన్స్ ఓనర్ అంబానీ కుటుంబం, ఓవల్ ఇన్విన్సిబుల్స్‌లో 49% వాటా కోసం £60 మిలియన్లకు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా, ఐటీ వ్యవస్థాపకుడు సంజయ్ గోవిల్ వెల్ష్ ఫైర్‌లో 49% వాటాను £40 మిలియన్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో 2 ఫ్రాంచైజీలు సదరన్ బ్రేవ్ అండ్ ట్రెంట్ రాకెట్స్ కూడా త్వరలోనే అమ్మకానికి వస్తాయని అంతా అనుకుంటున్నారు. అంతకు మునుపు ఆమె (సన్ గ్రూప్) 2012 సంవత్సరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కొనుగోలు చేసింది. ఈ జట్టు ఇప్పటివరకు ఒకసారి మాత్రమే ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: